ఈ అమ్మాయి పెళ్లి ఖర్చురూ .500 కోట్లు మాత్రమే!
కర్నాటక మార్చ్ 3
ఈ అమ్మాయిని చూశారా? ఈ అమ్మాయి పెళ్లి ఈ నెల 5న జరగబోతున్నది. అయితే మాకేంటి అంటారా? అదే తెలుసుకోవాల్సిన విషయం. ఈ అమ్మాయి పెళ్లికి దాదాపుగా లక్ష మంది అతిధులు రాబోతున్నారట. వివాహ విందు 40 ఎకరాలలో ఏర్పాటు చేశారు. వివాహానికి మొత్తం ఖర్చు రూ .500 కోట్లు మాత్రమే.వివాహ వేడుకలకు 27 ఎకరాలు, అతిథి వాహనాల పార్కింగ్ కోసం 15 ఎకరాలు ఉపయోగిస్తున్నారు. వివాహానికి ప్రధాన వేదిక హంపి విరుపాక్ష ఆలయం. 300 మంది కళాకారులు మూడు నెలలుగా వివాహ వేదికను పొందడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా కూడా వస్తారట.ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు అంటే బిజెపి సీనియర్ నాయకుడు, కర్ణాటకలో సభా నాయకుడు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి శ్రీరాములు కుమార్తె. ఈ అమ్మాయికి 9 రోజుల పెళ్లి చేస్తున్నారు.