చంద్రబాబు బీసీ వ్యతిరేకి
కడప మార్చ్ 3
అనుచరుడు ప్రతాప్ రెడ్డితో చంద్రబాబు. హైకోర్టు లో పిటీషన్ వేయించారు. ఎన్నికల్లో బిసీలకు 59.5% రిజర్వేషన్లు రాకూడదని బాబు కుట్ర. టీడీపీలో అంతో ఇంతో బీసీలకు న్యాయం చేసిన వ్యక్తి ఎన్టీఆరే తప్ప చంద్రబాబు కాదని చీప్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మంగళవారం అయన మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత బీసీల పట్ల చిత్తశుద్ధి చూపుతున్న వ్యక్తి వైయస్ వారసుడు జగన్. అచ్చం నాయుడు, కాల్వ శ్రీనివాసులు తప్ప మిగిలిన బీసీలు బాబుకు కనబడలేదా. బీసీ ల ఓట్లతో ఇన్నాళ్లూ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళిన టిడిపి. నేడు చంద్రబాబు వైఖరి ని బీసీలు తెలుసుకున్నారు. బడుగు బలహీన వర్గాలను చంద్రబాబు చిన్నచూపు చూస్తున్నారు. నాడు ఎవరన్నా ఎస్సీ, ఎస్టీల్లో పుట్టాలనుకుంటారా అన్న వ్యక్తి చంద్రబాబు. నేడు బడుగు బలహీన వర్గాలకు అత్యున్నత స్థానాన్ని ఇస్తున్న వైయస్ జగన్. బీసీలు వైసీపీ కి వెన్నుముక అన్న జగన్ అని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.