YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

బీజేపీ శనిగ్రహం..వైకాపా టీడీపీలు రాహుకేతువులు

బీజేపీ శనిగ్రహం..వైకాపా టీడీపీలు రాహుకేతువులు

బీజేపీ శనిగ్రహం..వైకాపా టీడీపీలు రాహుకేతువులు
కడప, మార్చ్ 3
రాష్ట్రానికి బిజేపి శనిగ్రహమైతే, వైసీపీ టిడిపిలు రాహుకేతువుల్లా తయారయ్యాయని ఎపి పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి విమర్శించారు. కడప నగరంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని టీడీపీ, వైసీపీ లు కబాలి పాత్ర పోసిస్తుంటే బీజేపీ మాత్రం మోసగాళ్ల పార్టీగా తయారైందన్నారు.  దేశంలో సబ్ కా వికాస్ బదులు సబ్ కా వినాస్ లాగా పాలన సాగుతోందదని మండిపడ్డారు. ఏపీలో టీడీపీ తెలుగు దద్దమ్మల పార్టీ గా తయారైందని, అధికారంలో ఉన్న వైసీపీ పరిస్థితి పెన్నం మీద నుండి పొయ్యిలో పడినట్లు ఉందన్నారు. రైతులకు, యువతకు, మహిళలకు, వృద్దులకు వైసీపీ తీరని ద్రోహం చేసిందని,  ఇలాంటి దృష్ట్రత్రయం పార్టీలను మట్టిలో కలిపి కాంగ్రెస్ పార్టీని స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించేలా పార్టీ శ్రేణులు పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. హైకోర్టు తీర్పు ఆధారంగా స్థానిక సంస్థలకు త్వరలోనే ఎన్నికలు జరగొచ్చునని, ఇందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సన్నద్దం కావాలని పిలుపునిచ్చారు.

Related Posts