వైకాపా మోసాలు మానాలి
కడప, మార్చ్ 3
బీసీలకు ఓ వైపు అన్యాయం చేస్తూ మరొ వైపు వైసిపి నేతలు మోసపూరిత మాటలతొ కల్లబొల్లి కాబుర్లతో మాట్లాడం సరికాదని కడప టిడిపి నేతలు అమీర్ బాబు, హరిప్రసాదులొ విమర్శించారు. కడపలొ నిర్వహించిన విలేకర్ల సమావేశంలొ వారు మాట్లాడుతూ మొదటి నుండి బిసి రిజర్వేషన్ విధానాన్ని ప్రవేశ పెట్టింది తెలుగుదేశం పార్టీయేనని, బిసి ల కోసం ఆహర్నిశలు కృషి చేసిందన్నారు. గతంలో బిసిలకు 25 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత ఎన్టీఆర్ దేనన్నారు. స్థానిక సమస్త ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కల్లబొల్లి కబుర్లు చెప్పుకుంటూ బిసి ప్రజలను మోసం చేస్తున్నది వైస్సార్ కాంగ్రెస్ పార్టీయేనని, ఇప్పటికైనా మోసం చేయడం మానీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.