YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

బ్రాండ్ల మద్యం బాటిళ్లతో బోండా ప్రెస్ మీట్

బ్రాండ్ల మద్యం బాటిళ్లతో బోండా ప్రెస్ మీట్

బ్రాండ్ల మద్యం బాటిళ్లతో బోండా ప్రెస్ మీట్
మార్చ్ 3
అయితే ప్రస్తుతం ప్రతిపక్షంలో రకరకాల ఫీట్లను చేస్తున్న తెలుగుదేశం పార్టీ.. మరో కొత్త ప్రయత్నం చేసింది. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తన తాజా ప్రెస్ మీట్ కు వివిధ బ్రాండ్ల మద్యం బాటిళ్లతో వచ్చారు! వాటిని చూపిస్తూ జగన్ ప్రభుత్వాన్ని ఆయన విమర్శించారు! ఇంతకీ కథేమిటంటే.. ఏపీలో ప్రభుత్వం నిర్వహిస్తున్న మద్యం దుకాణాల్లో పేరున్న బ్రాండ్లు దొరకడం లేదు అనేది బోండా ఉమ కంప్లైంట్! అన్నీ తక్కువ స్థాయి బ్రాండ్లను ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్ముతున్నారని ఆయన వాపోయారు. పేరున్న బ్రాండ్లు దొరకడం లేదని ఆరోపించారు. అందుకు రుజువులుగా.. డైరెక్టుగా మద్యం బాటిళ్లను తీసుకొచ్చారు. వాటిపై బ్రాండ్ల పేర్లను చూపించారు. జగన్ ప్రభుత్వం అలాంటి అనామాక బ్రాండ్లను మద్యం షాపుల్లో అమ్మకానికి ఉంచిందని ఇదంతా కమిషన్ల కోసమే అని బోండా ఉమ ఆరోపించారు. కమిషన్లు తీసుకుని... కొన్ని రకాల మద్యం బ్రాండ్లనే అమ్మకానికి ఉంచుతున్నారని ఆరోపించారు. ఇలాంటి మద్యం తాగి సామాన్యులు ఇబ్బంది పడుతూ ఉన్నారని ఆయన అన్నారు.ఈ విషయంలో ఇప్పటికే చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడారు. ఏపీలో మంచి మంచి బ్రాండ్ల మద్యం దొరకడం లేదని ఆయన ఆరోపించారు. అయితే అంతటితో ఆగక తెలుగుదేశం పార్టీ వాళ్లు ఇలా ప్రెస్ మీట్లు పెట్టి.. బ్రాండ్లను ప్రదర్శించారు.అయితే తెలుగుదేశం పార్టీ మద్యానికి ఇలా బ్రాండ్ అంబాసిడర్ గా మారడం ఏ మేరకు సబబు అనేది ఆలోచించాల్సిన అంశం. ఒకవైపు ఏపీలో మద్యాన్ని తీవ్రంగా కట్టడి చేశారు. బెల్టు షాపుల ఊసు లేదు. మద్యం అమ్మకాల విషయంలో చాలా పరిమితులు పెట్టారు. ఇలాంటి నేపథ్యంలో.. తెలుగుదేశం మద్యం దొరకడం లేదు అందునా బ్రాండెడ్ లిక్కర్ దొరకడం లేదు.. అని గగ్గోలు పెట్టడం నెగిటివ్ పబ్లిసిటీ అయ్యే అవకాశాలు లేకపోలేదు. దశలవారీగా మొత్తం మద్యాన్నే నిషేధించేలా ఉన్నారు ఏపీలో. ఇలాంటి నేపథ్యంలో ఇలా టీడీపీ నేతలు ఎందుకు మద్యంతో గోక్కుంటున్నారో!

Related Posts