YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 చిత్తూరులో వైఎస్ గుడి... పూజలు

 చిత్తూరులో వైఎస్ గుడి... పూజలు

 చిత్తూరులో వైఎస్ గుడి... పూజలు
తిరుపతి, మార్చి 4,
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి ఓ వీరాభిమాని గుడి కట్టించాడు. చిత్తూరు జిల్లా తవణంపల్లె మండల పరిధిలోని కాణిపాకపట్నం గ్రామానికి చెందిన వైఎస్సార్ వీరాభిమాని పట్నం రాజమాణిక్యం గ్రామంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆలయాన్ని నిర్మించి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఏడు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ఆలయాన్ని ఆదివారం అట్టహాసంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి ప్రారంభించారు. ఈ ఆలయంలో వైఎస్‌ఆర్ విగ్రహన్ని అందంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకుడు రాజమాణిక్యం మాట్లాడుతూ తనకు చిన్న తనం నుండి వైఎస్‌ఆర్ అంటే వెలకట్టలేని అభిమానం అన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా వున్న సమయంలో రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు అండగా నిలిచారన్నారు. ఆయన సేవలు ఇప్పటికీ సజీవంగా వున్నాయన్నారు. ఆయనపై అభిమానంతోనే సుమారు రూ.7లక్షల సొంత నిధులతో ఈ ఆలయాన్ని నిర్మించానన్నారు.ప్రతిరోజు ఆలయంలో రాజశేఖర్‌రెడ్డి పేరుతో అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు

Related Posts