YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు దేశీయం

 ఎంపీలో టీఎంసీ రాష్ట్ర అధ్యక్షుడు సెక్స్ దందా

 ఎంపీలో టీఎంసీ రాష్ట్ర అధ్యక్షుడు సెక్స్ దందా

 ఎంపీలో టీఎంసీ రాష్ట్ర అధ్యక్షుడు సెక్స్ దందా
భోపాల్, మార్చి 4
మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్‌లో భారీ సెక్స్ రాకెట్ గుట్టురట్టయింది. క్లినిక్ ముసుగులో వ్యభిచార దందా నడుపుతున్న ముఠాను పోలీసులు రెడ్ హ్యాండెట్‌గా పట్టుకున్నారు. వీరిలో మధ్యప్రదేశ్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చెప్పుకుంటున్న వ్యక్తి సహా 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో నలుగురు మహిళలు ఉన్నారు. భోపాల్ నగరంలోని బర్కాహేది ప్రాంతంలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.భోపాల్ నగరంలో ఓ క్లినిక్ నడుస్తోంది. అయితే అందులో మాత్రం గుట్టుగా వ్యభిచార దందా నడుపుతున్నారు. దీంతో ఈ వ్యవహారంపై గుర్తు తెలియని వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఈ క్లినిక్‌పై దాడి చేసిన పోలీసులు నలుగురు మహిళలు సహా మొత్తం 10 మందిని అదుపులోకి తీసుకున్నారు.ఈ వ్యవహారంపై క్రైమ్ బ్రాంచ్ డీఎస్పీ అదితి భవ్‌సర్ మాట్లాడుతూ.. నిందితుల్లో ఒకరు.. తాను పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మధ్యప్రదేశ్ శాఖకు అధ్యక్షుడిగా పనిచేస్తున్నట్లు చెప్పుకున్నట్లు వెల్లడించారు. అతడి విజిటింగ్ కార్డును పరిశీలించగా.. అందులో సచిన్ సింగ్ చౌహాన్ అని, టీఎంసీ రాష్ట్ర అధ్యక్షుడని రాసి ఉందని చెప్పారు.అలాగే పోలీసు బృందం సైతం నిందితుడి ఇంటికి వెళ్లి చూడగా.. అక్కడ సైతం సచిన్ ఇంటి మీద టీఎంసీ రాష్ట్ర అధ్యక్షుడు అనే రాసి ఉందని డీఎస్పీ అదితి భవ్‌సర్ వెల్లడించారు. అయితే బర్కాహేది ప్రాంతంలో వ్యభిచారం జరుగుతోందని గుర్తు తెలియని డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు అడిషనల్ సూపరింటెండెంట్ (క్రైమ్) నిశ్చల్ ఝరియా వెల్లడించారు. దీంతో తాము వెళ్లి సెక్స్ రాకెట్ దందా  గుట్టురట్టు చేసినట్లు వివరించారు.ఈ సెక్స్ రాకెట్ దందాలో కీలక వ్యక్తి గాయత్రి వీర్ సింగ్ (40) అని నిశ్చల్ ఝరియా అని వెల్లడించారు. ఆమె తాను డాక్టర్ అని చెప్పారని ఆయన తెలిపారు. ఈమెను కాక మరో ముగ్గురు మహిళలను అదుపులోకి తసుకున్నట్లు వివరించారు. వీరి వయసు 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉంటుందని పేర్కొన్నారు. ఈ నలుగురు మహిళలు కాక, మరో ఆరుగురు విటులను అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు.

Related Posts