YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

కర్ణాటకకు బీజేపీ ఒక్కటే ప్రత్యామ్నాయం..

Highlights

  • ఈ గెలిచి దక్షిణాదిలో బీజేపీని విస్తరిస్తాం
  • కాంగ్రెస్ అవినీతికి  ఏటీఎంలా  సిద్దరామయ్య సర్కారు 
కర్ణాటకకు బీజేపీ ఒక్కటే ప్రత్యామ్నాయం..

కర్ణాటకలో బీజేపీ ఒక్కటే ప్రత్యామ్నాయమని  బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. కాంగ్రెస్ నుంచి తమకు పోటీ ఎదురవుతుందని తాను అనుకోవడం లేదని స్పష్టం చేశారు. ఇక్కడ గెలవడం ద్వారా దక్షిణాదిలో పార్టీని విస్తరిస్తామని షా స్పష్టం చేశారు. అవినీతి ప్రభుత్వాన్ని పెకలించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మైసూరులోని చామరాజనగర్, మాండ్యా జిల్లాల్లో పర్యటిస్తున్న ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్ హయాంలో కర్ణాటక అవినీతికి డెన్‌లా మారిందని అమిత్ షా ఆరోపించారు.కర్ణాటక ప్రభుత్వాన్ని కాంగ్రెస్ తన అవినీతికి ఏటీఎంలా వాడుకుందంటూ ముఖ్యమంత్రి  సిద్దరామయ్యపై మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే  లింగాయత్ మైనారిటీ ట్యాగును ఉపయోగించుకుంటోందని అమిత్ షా ఎద్దేవా చేశారు.

Related Posts