YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు దేశీయం

 ఉరిశిక్షకు డెత్ వారెంట్లు

 ఉరిశిక్షకు డెత్ వారెంట్లు

 ఉరిశిక్షకు డెత్ వారెంట్లు
న్యూఢిల్లీ, మార్చి 5 
నిర్బయ దోషులు తమకున్న చట్టపరమైన అన్ని అవకాశాలూ పూర్తయ్యాయి. మూడోసారి దోషులకు ఉరి వాయిదా పడింది. ఉరి వాయిదా వేయించేందుకు నిర్భయ దోషులు అక్షయ్‌ ఠాకూర్‌, పవన్‌ గుప్తా, వినయ్‌ శర్మ, ముకేశ్‌సింగ్‌‌లు శతవిధాలా ప్రయత్నించారు. మార్చి 3న ఉరిశిక్ష అమలుచేయాలంటూ ఫిబ్రవరి 17న పాటియాలా హౌస్‌ కోర్టు డెత్‌వారెంట్లు జారీ చేసింది. అయితే, దోషి పవన్‌ గుప్తా దాఖలుచేసిన క్యూరేటివ్‌ పిటిషన్‌ సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీంతో క్షమాభిక్ష కోసం రాష్ట్రపతికి దరఖాస్తు చేశాడు. దీన్ని సాకుగా చూపించి డెత్‌వారెంట్లపై స్టే విధించాలని కోర్టును ఆశ్రయించడంతో మూడోసారి ఉరిశిక్ష వాయిదా పడింది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి అతడి క్షమాభిక్ష పిటిషన్‌ను బుధవారం తిరస్కరించారు.మరోవైపు, నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలుపై ఢిల్లీ ప్రభుత్వం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దోషులు తమకున్న న్యాయపరమైన అన్ని అవకాశాలనూ వినియోగించుకున్నారని అయితే అవి వారి  నిర్దోషిత్వాన్ని నిరూపించలేకపోయాయని తెలిపింది. వారి ఉరిశిక్షకు తాజాగా డెత్‌ వారెంట్లు జారీ చేయాలని కోరింది. దోషుల్లో చివరి వాడైన పవన్‌ గుప్తా క్షమాభిక్ష పిటిషన్‌ కూడా తిరస్కరణకు గురైన నేపథ్యంలో ఈ మేరకు బుధవారం పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై రేపటిలోగా జవాబు ఇవ్వాలని దోషులకు కోర్టు నోటీసులు జారీ చేసింది.మరోవైపు, నిర్భయ దోషుల ఉరిపై సర్వోన్నత న్యాయస్థానం గురువారం కీలక నిర్ణయం తీసుకోనుంది. దోషులను ఒకేసారి ఉరి తీయాలా? వేర్వేరుగా ఉరిశిక్ష అమలుచేయాలా? అనేది తేల్చనుంది. నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులకు విధించిన ఉరిశిక్షను నిలిపివేస్తూ ట్రయిల్ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ఢిల్లీ హైకోర్టు గతంలోనే సమర్థించింది. ట్రయిల్ కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేంద్రం వేసిన పిటిషన్‌ను కొట్టివేసిన  ఢిల్లీ హైకోర్టు.. నలుగురు దోషులుకు వేర్వేరుగా ఉరి శిక్షను అమలు చేయడం సాధ్యం కాదని పేర్కొంది.నిర్భయ కేసులో నలుగురు దోషులూ ఒక ‘‘కామన్ ఆర్డర్‌’’కు లోబడి ఉన్నారని, వారిని వేర్వేరుగా ఉరితీయడం కుదరదని కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకుంది. మరోవైపు, ఉరిశిక్ష అమలుకు కొత్త తేదీని ప్రకటించాలని తిహార్‌ జైలు అధికారులు కూడా కోర్టులో పిటిషన్‌ వేశారు. మరోవైపు నిర్భయ కేసు  దోషుల మానసిక, శారీరక స్థితిని అంచనా వేసేందుకు మార్గదర్శకాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు తిరస్కరించింది. =

Related Posts