YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

వివాహేతర సంబంధానికి మరో ప్రాణం బలి

వివాహేతర సంబంధానికి మరో ప్రాణం బలి

వివాహేతర సంబంధానికి మరో ప్రాణం బలి
మహబూబ్ నగర్, మార్చి 5 
వివాహేతర సంబంధానికి మరో ప్రాణం బలైపోయింది. తన సుఖానికి అడ్డొస్తున్నాడన్న కోపంతో ఓ మహిళ తాళి కట్టిన భర్తను కిరాతకంగా చంపేసింది.  పోలీసుల విచారణలో ఘోరం వెలుగుచూడటంతో నేరాన్ని ఒప్పుకుని కటకటాల పాలైంది.నాగర్‌కర్నూలు జిల్లా తాడూరు మండలం పర్వతాయిపల్లికి చెందిన  దాసరి యాదయ్య(35) మేస్త్రీ పని చేస్తున్నాడు. అతడికి కొంతకాలం క్రితం భాగ్యమ్మ అనే మహిళతో వివాహమైంది. యాదయ్య స్నేహితుడు మెగావత్‌  గోవింద్‌తో ఆమె చాలాకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న యాదయ్య ప్రవర్తన మార్చుకోవాలని భార్యను హెచ్చరిస్తూ  వస్తున్నాడు.ఈ క్రమంలోనే ఫిబ్రవరి 28న పనికోసం నాగర్‌కర్నూల్ వెళ్లిన యాదయ్య తిరిగి ఇంటికి చేరుకోలేదు. కుటుంబసభ్యులు ఎంత వెతికినా ఆచూకీ  లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే మార్చి 1న చెర్ల తిర్మలాపూర్, తుమ్మలసూగరు మధ్య కేఎల్‌ఐ కాల్వలో మృతదేహం  తెలియడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నాడు. ఆ మృతదేహం యాదయ్యదేనని కుటుంబసభ్యులు గుర్తించడంతో ఆస్పత్రికి తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.యాదయ్య బైక్ సంఘటనా స్థలానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉండటంతో పోలీసులను అనుమానం వచ్చింది. దీనిపై వారు లోతుగా దర్యాప్తు చేస్తున్న సమయంలో భాగ్యమ్మ  గ్రామ సర్పంచ్‌ బాల్‌రెడ్డి దగ్గరకు వెళ్లి తన భర్తను ప్రియుడితో కలిసి హతమార్చినట్లు తెలిపింది. ఆయన వెంటనే పోలీసులకు సమాచారం అందించగా వారు భాగ్యమ్మను అదుపులోకి తీసుకుని స్టేషన్‌లో చారించారు.తన  అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను చంపేయాలని నిర్ణయించుకున్న భాగ్యమ్మ ప్రియుడితో కలిసి ప్లాన్ వేసింది. ఫిబ్రవరి 28వ తేదీన బిజినేపల్లి వెళ్లి తాడు, రెండు మద్యం బాటిళ్లు కొనుగోలు చేసింది. అనంతరం ప్రియుడితో భర్తకు ఫోన్‌ చేయించి మాట్లాడుకుందాం రమ్మంటూ బ్రిడ్జి వద్దకు రప్పించింది. దీంతో యాదయ్య అక్కడి చేరుకోగా ఇద్దరూ కలిసి మద్యం తాగారు. యాదయ్య మత్తులోకి జారుకోగానే ప్రియుడితో కలిసి భాగ్యమ్మ అతడికి తాడుతో ఉరేసి చంపేసి మృతదేహాన్ని కాలువలో పడేసింది. నిందితులిద్దరిపై హత్యకేసు నమోదు చేసిన పోలీసులు వారిని రిమాండ్‌కు తరలించారు

Related Posts