YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి రిజర్వేషన్లపై సుప్రీం లో టీడీపీ పిటిషన్ 

 స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి రిజర్వేషన్లపై సుప్రీం లో టీడీపీ పిటిషన్ 

 స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి రిజర్వేషన్లపై సుప్రీం లో టీడీపీ పిటిషన్ 
విజయవాడ మార్చి 5
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో తెలుగుదేశం పార్టీ పిటిషన్ దాఖలు చేసింది.  ఎంపీ కె రామ్మోహన్ నాయుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీలు నిమ్మల కిష్టప్ప, కొనకళ్ల నారాయణ, పల్లా శ్రీనివాసరావు ఈ పిటిషన్ ను దాఖలు చేసారు. ఆంధ్రప్రదేశ్ లో  స్థానిక సంస్థల ఎన్నికల్లో  బీసీలకు రిజర్వేషన్ల తగ్గింపును సవాలు చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.   ఎంపీ  రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ  బీసీ రిజర్వేషన్ల కుదింపు నిర్ణయం జగన్ మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగింది. వైఎస్ఆర్సిపి సంబంధిత  వ్యక్తులు, జగన్మోహన్ రెడ్డి సన్నిహితులు హైకోర్టులో సుప్రీంకోర్టులోనూ బీసీ రిజర్వేషన్లు తగ్గించే ప్రయత్నం చేశారు. జగన్ అధికారంలోకి రావడానికి బీసీలు సహకరిస్తే వారి రిజర్వేషన్లనే జగన్ కుదిస్తున్నాడు. బీసీ రిజర్వేషన్లు తగ్గడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 15 వేల మంది బీసీ నాయకులు సంఖ్య తగ్గిపోతుందని అన్నారు. సొంత కేసులకు కోట్ల రూపాయల న్యాయవాదులు పెట్టుకునే జగన్ బీసీల కేసులో ఎందుకు సమర్ధుడైన లాయర్ను నియమించలేదు. గతంలో ప్రభుత్వం  విడుదల చేసిన జీవో 176 ను యధాతథంగా అమలు చేయాలని అన్నారు.  బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా వినియోగించుకునేందుకు చూశాడు తప్ప వారికి న్యాయం చేయాలని చూడలేదని అన్నారు. మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప మాట్లాడుతూ ప్రభుత్వం సరిగా పట్టించుకోకపోవడం వల్లే మేము సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాల్సి వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 34 శాతం ఉన్న బీసీల రిజర్వేషన్ 24 శాతానికి ఎలా  పడిపోతుంది. బీసీలకు రాజ్యాధికారం దక్కకూడదన్న దురుద్దేశంతోనే ఇలాంటి పరిణామాలు తలెత్తుతాయని అన్నారు. మరో మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ మాట్లాడుతూ బలహీన వర్గాలకు జగన్మోహన్ రెడ్డి తీరని అన్యాయం చేస్తున్నాడు. జగన్   బీసీల ద్రోహిగా చరిత్రలో నిలిచిపోతాడు.  కోర్టుల ద్వారా రిజర్వేషన్ల అమలుకు ఎదురవుతున్న ఇబ్బందులను ప్రభుత్వం ముందే ఎందుకు గ్రహించి స్పందించలేదని ప్రశ్నించారు. 

Related Posts