YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

తెలంగాణలో ఎవ్వరికి కరోనా లేదు

తెలంగాణలో ఎవ్వరికి కరోనా లేదు

తెలంగాణలో ఎవ్వరికి కరోనా లేదు
హైద్రాబాద్, మార్చి 5 
కరోనా వైరస్‌పై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని తెలంగాణ ఆరోగ్యశాఖమంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టంచేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు మాత్రమే పాజిటీవ్‌గా తేలిందని, అదీ దుబాయ్‌ నుంచి వచ్చిన వ్యక్తి అని తెలిపారు. వైరస్‌ లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన ఇద్దరి రిపోర్టులు కూడా నెగెటివ్‌గా వచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ మేరకు పూణే నుంచి వచ్చిన పరీక్ష రిపోర్టులను మంత్రి చూపించారు. భారత్‌లోనూ కరోనా ప్రభావం అంతగాలేదని చెప్పారు. గడిచిన నాలుగు రోజుల నుంచి ప్రజలు, అధికారులు ఎంతో సహకరించారని అన్నారు. రాబోయే రోజుల్లోనూ కరోనా వైరస్‌ను తెలంగాణలోకి రాకుండా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం చేసిన కృషిని కేంద్ర ప్రభుత్వం మెచ్చుకుందన్నారు.‘కరోనాతో ప్రజలు భయపడాల్సిన అవసరంలేదు. మాస్క్‌లను అధిక ధరలకు విక్రయిస్తున్న మెడికల్‌ షాపులపై కఠిన చర్యలు తీసుకుంటాం. కరోనా అనేది గాలితో వ్యాప్తి చెందదు. నోటి తుంపర్లు ద్వారా కళ్ళలో పడితే వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. వైరస్‌ లక్షణాలు ఉంటేనే పరీక్షలు చేస్తాం. అనుమానం ఉంటే, డబ్బులు ఉంటే కరోనా టెస్టులు చేయం. వైరస్‌ లక్షణాలను డాక్టర్లు నిర్ధారిస్తేనే పరీక్షలు చేస్తాం. దీనిపై ప్రజలకు మరింత అవగాహన కలిగించే విధంగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి’ అని అన్నారు.

Related Posts