జీవోను పరిరక్షించాల్సిన మంత్రే జీవోను ఉల్లంఘింస్తే...జీవన్ రెడ్డి
హైదరాబాద్ మార్చ్ 6
నీటి వనరులను కాపాడే 111 జీవోను పరిరక్షించాల్సిన మునిసిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కేటీఆర్ స్వయంగా ఆయనే దాన్ని ఉల్లంఘిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి ఆరోపించారు. 111 జీవో నిబంధనలకు విరుద్ధంగా ఆయన 25 ఎకరాల్లో ఫామ్ హౌస్ నిర్మాణం చేపట్టారని దాన్ని ప్రశ్నించినందుకు మల్కాజ్ గిరి ఎంపి రేవంత్ రెడ్డిని అరెస్టు చేశారని ఆయన అన్నారు. కేటీఆర్ తన విలాసవంతమైన జీవనం కోసం 111 జీవోను ఉల్లంఘించారని జీవన్ రెడ్డి అన్నారు.కేటీఆర్ ఉల్లంఘనలను బయటపెట్టినందుకు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని ఆయన అన్నారు. పోలీసులు అధికారులు కూడా అసలు దొంగలను పట్టుకోవడం మానేసి ప్రజా ప్రతినిధులను అరెస్ట్ చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. ఫామ్ హౌస్ కేటీఆర్ ది కాదు..కానీ ఆయన కొన్ని ఏండ్లుగా వాడుకుంటున్నారు అని బాల్కసుమన్ చెప్పారని మరి ఫామ్ హౌస్ ఎవరిదని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ కి ఎర్రవల్లిలో ఫామ్ హౌస్- కేటీఆర్ కి జన్వాడ లో ఫామ్ హౌస్ ఎందుకు? అని ఆయన ప్రశ్నించారు.