మైనార్టీల ఓట్ల కోసం వైసీపీ కొత్త నాటకం: తులసీరెడ్డి
కర్నూలు మార్చ్ 6
మైనార్టీల ఓట్ల కోసం వైసీపీ కొత్త నాటకం ఆడుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత తులసీరెడ్డి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. శుక్రవారం కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో... బీజేపీ తోక పార్టీగా జనసేన మారిందని విమర్శించారు. ప్రత్యేకహోదా ఇవ్వని బీజేపీతో జనసేన పొత్తు దారుణమన్నారు. అప్పులు చేయడంలో సీఎం జగన్.. చంద్రబాబును మించిపోయారని తులసిరెడ్డి అన్నారు.