YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

స్ధానిక సంస్థల్లో అందరికి సముచిత స్థానం: మంత్రి బొత్సా

స్ధానిక సంస్థల్లో అందరికి సముచిత స్థానం: మంత్రి బొత్సా

స్ధానిక సంస్థల్లో అందరికి సముచిత స్థానం: మంత్రి బొత్సా
అనంతపురం మార్చ్ 6
‘గత ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన వారిని స్ధానిక సంస్థల్లో అభ్యర్థులుగా నిలపండి. ముఖ్యమంత్రి మాటగా చెబుతున్నా.. అందరికి సముచిత స్థానం కల్పిస్తాం’ అని మంత్రి బొత్సా సత్యనారాయణ స్పష్టం చేశారు. ఇవాళ అనంతరపురం జిల్లాలో మీడియా మీట్ నిర్వహించిన ఆయన.. రేపో ఎల్లుండో స్థానిక సంస్థలకు నోటిఫికేషన్ రాబోతుందన్నారు. వ్యవస్థను బాగుచేయాలనే ఉద్దేశ్యంతో స్ధానిక సంస్థల ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.‘ అర్హులైన వారికి పెన్షన్లు ఇస్తున్నాం. ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లు ఇవ్వడం ఒక చరిత్ర. పార్టీలకు అతీతంగా అందరికి ఉగాది పండుగ సందర్భంగా ఇంటి స్థలాలు ఇస్తాం. ఎన్నికల్లో సంస్కరణలు చేయాలనే ఉద్దేశ్యంతో డబ్బు, మద్యం పంపిణీ చేయకూడదనే ముఖ్యమంత్రి చట్టం చేశారు. గ్రామ వాలంటీర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాము. టీడీపీ వ్యక్తులు కోర్టుకు వెళ్లి స్ధానిక సంస్థల ఎన్నికలను రెండు నెలలు ఆలస్యం చేశారు. పార్టీలో విబేధాలు విడనాడి అన్ని స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు గెలవాలి.. గెలిపించాల్సిందే’ అని స్థానిక నేతలకు, ఎమ్మెల్యేలకు మంత్రి బొత్స చెప్పారు.

Related Posts