రజనీ కాంత్ కు వరుస ఇబ్బందులు
చెన్నై, మార్చి 7
తమిళ సూపర్ స్టార్ పొలిటికల్ ఎంట్రీపై తరుచూ చర్చ జరుగుతూనే ఉంది. ఇదిగో అదిగో అంటూ ప్రచారం చేస్తూనే ఉన్నారు. కానీ ఇంత వరకూ విధి విధానాలు ఎన్నికల్లో పోటీ దిశగా పెద్దగా అడుగులు పడినట్టుగా కనిపించలేదు. తాజాగా రజినీ పొలిటికల్ ఎంట్రీ కసరత్తుగ భావించిన అభిమానుల సంఘం ‘రజనీ మక్కల్ మండ్రం’ సమావేశం నిరాశగా ముగిసింది. గురువారం జరిగిన ఈ భేటీలో తాను నిరాశకు గురయ్యాయని, ఎందుకన్నది సమయం వచ్చినప్పుడు చెప్తానని ఆయన అన్నారు. ఇంకో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పలువురు ముఖ్యనేతలతో చెన్నైలోని రాఘవేంద్ర మండపంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల కార్యదర్శులు, కొందరు ముఖ్య నాయకులు దీనికి హాజరయ్యారు. దీంతో క్షేత్ర స్థాయిలో రాజకీయ అంశాలపై చర్చ జరిగినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఆయన చర్చించిన అంశాలపై వెల్లడించనప్పటికీ పార్టీ స్థితిగతులపై రజినీ ఆరా తీసినట్లు చెబుతున్నారు. కాగా చాలా కాలంగా రజనీకాంత్ బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతూ వచ్చారు.రజనీకాంత్ తన పార్టీ పేరు, విధివిధానాలను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. కాగా రజనీ కాంత్ రెండేళ్ల క్రితం తాను రాజకీయాల్లోకి వస్తానని, కొత్త పార్టీ పెడతానని ప్రకటించిన సంగతి తెలిసిందే.