YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

 ఇంతక‌న్నానీచం మ‌రొక‌టి ఉండ‌దు

Highlights

  • వివాదాస్పదమైన పోసాని చర్చపై మంచు లక్ష్మి స్పందన 
 ఇంతక‌న్నానీచం మ‌రొక‌టి ఉండ‌దు

ఇండ‌స్ట్రీలోని మ‌హిళ‌ల గురించి అమ‌ర్యాద‌గా మాట్లాడి ప‌బ్లిసిటీ పొంద‌డం క‌న్నా నీచం మ‌రొక‌టి ఉండ‌దు అని మంచు లక్ష్మీ ట్వీట్ చేశారు. ప్రత్యేక హోదా అంశంపై సినీ నటుడు పోసాని కృష్ణమురళీతో చర్చా వేదికలో భాగంగా సినీ పరిశ్రమకు చెందిన మహిళలపై తీవ్ర అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం అత్యంత వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.దీనిపై సోషల్ మీడియాలో స్పందించిన మంచు లక్ష్మీ దీనిని తేలికగా తీసుకోమన్నారు. న‌టీమ‌ణుల‌ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నా కూడా ఎవ‌రు పెద్దగా ప‌ట్టించుకోరు. కానీ తాజాగా జ‌రిగిన సంఘ‌ట‌న‌ని నేను ఖండిస్తున్నాను. చర్చ ఏదైనా మ‌హిళ‌ల‌ని జ‌న‌ర‌లైజ్‌, టార్గెట్ చేస్తూ ఎవ‌రూ మాట్లాడ‌రని అన్నారు. కాగా  తెలుగు సినీ పరిశ్రమలోని తారలను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన TV5 టెలివిజన్ చానెల్ ఎడిట‌ర్‌పై  క్రిమినల్ చర్యలు తీసుకోవాలని మా అధ్యక్షుడు శివాజీరాజా, బెనర్జీ, ఏడిద శ్రీరామ్, ఝాన్సీ, హేమా, ప్రగతి, దర్శకురాలు నందిని రెడ్డి తదితరులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు  జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే. 

Related Posts