YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం విదేశీయం

కరోనా లక్షణాలతో రుయాలో చేరిన విదేశీయులు

కరోనా లక్షణాలతో రుయాలో చేరిన విదేశీయులు

కరోనా లక్షణాలతో రుయాలో చేరిన విదేశీయులు
తిరుపతి  మార్చి 07 
తిరుపతి నగరంలో కరోనా కలకలం రేపింది. ఆ వ్యాధీ  లక్షణాలు ఉన్నాయన్న అనుమానంతో ఇద్దరు విదేశీయులు  స్థానిక  రుయా ఆసుపత్రిలో చేరారు. జలుబు, దగ్గుతో బాధపడుతున్న కువైట్, నెదర్లాండ్స్కు చెందిన ఇద్దరు శుక్రవారం రాత్రి రుయాకు వచ్చారు. వారిద్దరిని  ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. రక్త నమూనాలను సేకరించిన వైద్యులు, వాటిని పరీక్షల కోసం తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి పంపించారు. స్విమ్స్లోనే రక్త నమూనాలు  పరిశీలించే ఏర్పాట్లు  చేశారు. ఇద్దరు విదేశీయుల ఆరోగ్యం నిలకడగానే ఉందని రుయా ఆసుపత్రి సూపరింటిండెంట్ రమణయ్య తెలిపారు. వైద్యుల, సిబ్బంది మినహా ఐసొలేషన్ వార్డు సమీపంలోకి ఎవరూ రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

Related Posts