YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వాటికన్ వెళితే క్రిస్టియన్ అయిపోతారా

వాటికన్ వెళితే క్రిస్టియన్ అయిపోతారా

వాటికన్ వెళితే క్రిస్టియన్ అయిపోతారా
విజయనగరం, మార్చి 7
తాను ఎవరికీ భయపడబోనని, తానేంటో నిరూపించుకుంటానని సింహాచలం దేవస్థానం ట్రస్ట్‌ బోర్డు చైర్‌పర్సన్‌గా, మహారాజా అలక్‌ నారాయణ సొసైటీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌(మాన్సాస్‌) ట్రస్ట్‌ చైర్‌పర్సన్‌ సంచయిత గజపతిరాజు అన్నారు. తన పనితీరు చూడకుండానే విమర్శలు చేయడం సరికాదని అన్నారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మాన్సాస్‌ ట్రస్ట్‌ను సమర్థవంతంగా నడిపిస్తానన్న నమ్మకాన్నివ్యక్తం చేశారు. మాన్సాస్ ట్రస్ట్‌ చైర్‌పర్సన్‌ కావడానికి తనకు అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పారు. చీకటి జీవోతో తాను పదవి దక్కించుకున్నానని టీడీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలను తోసిపుచ్చారు. చట్టబద్ధంగా తాను ట్రస్ట్‌ చైర్‌పర్సన్‌ అయ్యానని స్పష్టం చేశారు. గతంలో అశోక్‌గజపతి కుమార్తె అదితి విజయలక్ష్మిని ట్రస్ట్‌ సభ్యురాలిగా నియమించి తనను విస్మరించారని వాపోయారు. ఆ రోజు తనను ఎందుకు పక్కనపెట్టారని ప్రశ్నించారు. తన పట్ల టీడీపీ నాయకుల వ్యాఖ్యలు వివక్షాపూరితంగా ఉన్నాయని, మహిళలకు వారసత్వ హక్కు కల్పించింది ఎన్టీఆర్‌ అని గుర్తు చేశారు. పురుషులతో సమానంగా పనిచేయగల సామర్థ్యం తనకు ఉందన్నారు. మాన్సాస్ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థల్లో చదువుకుంటున్న వారిలో 60 శాతంపైగా బాలికలు ఉన్నారని వెల్లడించారు. మహిళలను తక్కువగా అంచనా  వేయడం సరికాదని హితవు పలికారు.తాను హిందువుని కాదన్నట్టుగా తన బాబాయ్‌ అశోక్‌గజపతిరాజు మాట్లాడటం పట్ల సంచయిత ఆవేదన చెందారు. బాబాయ్‌ ఇలా మాట్లాడతారని అస్సలు ఊహించలేదని కంటతడి పెట్టారు. ‘వాటికిన్‌ వెళ్లి ఫొటో దిగినంత మాత్రాన క్రిస్టియన్‌ అవుతానా? మీరెప్పుడూ మసీదులు, చర్చిలు, గురుద్వారాలకు వెళ్లలేదా? ఎన్నోసార్లు వెళ్లి మీరు ఫొటోలు కూడా తీయించుకున్నారు. అంతమాత్రన మీరు హిందువు కాకుండా పోయారా? మీలాగే నేను ఇతర మతాల ప్రార్థనాలయాలకు వెళ్లాను. నా తల్లిదండ్రులు ఆనందగజపతిరాజు, ఉమా గజపతిరాజు హిందువులు. వారి కుమార్తెగా నేను కూడా అదే బాటలో నడుస్తున్నాను. కుటుంబంలో ఎన్ని వివాదాలు ఉన్నా నేనెప్పుడూ చెడుగా చెప్పలేదు. పెద్దల పట్ల గౌరవంతో మౌనంగా ఉన్నాను. నా వారసత్వాన్ని గుర్తించి మాన్సాస్ ట్రస్ట్‌లో అవకాశం కల్పించాలని ప్రభుత్వానికి విన్నవించుకున్నాను. దీన్ని పరిశీలించి ప్రభుత్వం నాకు అవకాశం కల్పించింద’ని సంచయిత వివరించారు

Related Posts