స్థానిక సంస్థల ఎన్నికలకు మందు వైసిపి కి వరుస షాక్లు
అనంతపురం మార్చ్ 9
స్థానిక సంస్థల ఎన్నికలకు మందు అధికారపార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయ్. ఇప్పటికే రాజధాని అమరావతి ప్రాంతంలో ఒకరిద్దరు నేతలు రాజీనామా చేయడం.. ఆ తర్వాత కర్నూలు జిల్లాలో ఒకేసారి 300 మంది వైసీపీకి టాటా చెప్పేసిన విషయం తెలిసిందే.అయితే తాజాగా.. అనంత జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీలోని 14,15, వార్డుల నుంచి వైసీపీకి చెందిన 10 కుటుంబాలు టీడీపీలో చేరాయి. నియోజకవర్గ ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వరనాయుడు ఆ 10 కుటుంబాలకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాదినేని మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీలోకి వలసలు మొదలయ్యాయని.. మున్ముంథు మరింత మంది టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని చెప్పుకొచ్చారు.