వైకాపాకు రెబెల్స్ బెడద
కడప మార్చ్ 9
స్ధానిక సంస్ధల ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీకి రెబల్ అభ్యర్ధులు స్ధానిక సంస్ధల ఎన్నికల్లో తలనొప్పిగా మారారు. జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ పార్టీ స్టాపించి నప్పటి నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న వారికి అవకాశం ఇవ్వడం లేదంటూ పార్టీలో పని చేసిన నేతలే రెబల్ అభ్యర్ధులుగా రంగంలోకి దిగుతున్నారు. పార్టీ కోసమే పనిచేసే కార్యకర్తలను రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి విస్మరించి ఇప్పుడు డబ్బుకే ప్రదాన్యత ఇస్తున్నారని కడప జిల్లా సిద్దవటం మండల కన్వీనర్ నీలకంఠ రెడ్డి ఆరోపించారు.పార్టీ అధికారం లో లేనప్పుడు ఇప్పటి ప్రస్తుత ఎమ్మెల్యే మేడా అప్పట్లో టీడీపీ ఎమ్మెల్యే గా ఉన్నారని కానీ పార్టీ నే నమ్ముకున్న మా లాంటి వ్యక్తులకు జడ్పీ టికెట్ ఇవ్వకుండా కొత్త వారికి ఇవ్వడం పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సిద్దవటం జడ్పిటిసి కి వైసీపీ రెబల్ గా నామినేషన్ వేస్తానన్నారు .ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి,దివంగత నేత వైఎస్సార్ ఫోటో లు పెట్టుకుని పార్టీ తరపున పోటీ చేసి గెలిచి ముఖ్యమంత్రి కి బహుమానం ఇస్తానన్నారు.పార్టీ కోసం కష్టపడే వ్యక్తులకు తగిన ప్రాదాన్యత ఇవ్వాలని జగన్ చెప్పినప్పటికి ఇక్కడ పరిష్థితి అలా లేదన్నారు