YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి సత్తా చాటాలి

 స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి సత్తా చాటాలి

 

 స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి సత్తా చాటాలి
 గూడూరు మాజీ ఎమ్మెల్యే
నెల్లూరు మార్చ్ 9 
ఈ నెలల్లోనే జరగబోవు స్థానిక సంస్థ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సత్తా చాటాలని గూడూరు మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్  పేర్కొన్నారు, ఆదివారం కోట గ్రామంలోని టీడీపీ అధ్యక్షుడు మద్దాలి సర్వోత్తమ రెడ్డి స్వగృహం లో  స్థానిక సంస్థ ఎన్నికల్లో పోటీ చేసే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎంపిక ప్రక్రియ లో భాగంగా సమీక్ష సమావేశం నిర్వహించారు, ఈ సమావేశంలో  పాల్గున్న మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ మాట్లాడుతూ రేపటి నుండి నామినేషన్ పక్రియ ప్రారంభం అవుతుంది అనీ, నామినేషన్ పత్రాలను దాఖలు చేసేటప్పుడు అభ్యర్థులు జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు,అనుభవం ఉన్నవారి చేత పత్రాలు పూరించుకొని,అన్నీ పత్రాలు పరిశీలించి ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలను సమర్పించలాన్నారు, ప్రభుత్వం ఎన్నికల్లో మద్యం, డబ్బులు పంచకూడదు అనీ ఆర్డినెన్స్ తీసుకొని వచ్చారు,ఈ పరిస్థితిలలో అభ్యర్థులు జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు, టీడీపీ  అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలపై అధికార పార్టీ నాయకులు దాడులు చేసేందుకు కుట్రలు పన్నుతారు అనీ, అలాంటి సందర్భలలో సెల్ ఫోన్ ను వినియోగించుకొని, పార్టీ యాప్ కు పంపాలని ఆయన సూచించారు.అనంతరం అభ్యర్థులు ఎంపిక ప్రక్రియ చేపట్టారు, ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు మద్దాలి సర్వోత్తమ రెడ్డి, టీడీపీ నేతలు పలగాటి భాస్కర్ రెడ్డి, పలగాటి జితేంద్ర రెడ్డి, దువ్వూరు శ్రీనివాసులు రెడ్డి, దేవా రెడ్డి మనోజ్ రెడ్డి, షేక్ జలీల్ అహ్మద్ బాషా, షేక్ షంషూద్దీన్ వాక భాస్కర్ రెడ్డి, మర్రి పొలయ్య,దారా సురేష్, రామయ్య, రమేష్, బాల కృష్ణ యాదవ్,గుఱ్ఱం అశోక్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts