YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

మార్చి 20న శ్రీ కల్యాణవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పుష్పయాగం     

మార్చి 20న శ్రీ కల్యాణవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పుష్పయాగం     

మార్చి 20న శ్రీ కల్యాణవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పుష్పయాగం        
తిరుపతి మార్చ్ 9 
 శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మార్చి 20వ తేదీన వార్షిక పుష్పయాగం వైభవంగా జరుగనుంది. తిరుమల శ్రీవారి ఆలయం త‌ర‌హాలోనే ఇక్కడ పుష్పయాగం నిర్వహిస్తారు. ఆల‌యంలో ఫిబ్ర‌వ‌రి 14 నుండి 22వ తేదీ వ‌ర‌కు బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం తెలిసిందే. ఈ బ్రహ్మోత్సవాల్లో అర్చక పరిచారకుల వల్ల, అధికార  అనధికారుల వల్ల, భక్తుల వల్ల ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు  తొలగిపోతాయని అర్చకులు తెలిపారు.  మార్చి 19న గురువారం సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు అంకురార్పణం జరుగనుంది. మార్చి  20న శుక్ర‌వారం ఉదయం 10 నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం  నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె,  పసుపు, చందనం, కొబ్బరినీళ్ల‌తో అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం 2 నుండి 4.30 గంటల వరకు  పుష్పయాగం కన్నుల పండువగా జరుగనుంది. ఇందులో తులసి, చామంతి, గన్నేరు, మొగలి, మల్లె, జాజి సంపంగి, రోజా, కలువలు వంటి పలురకాల  పుష్పాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు. సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు వీధి ఉత్సవం నిర్వహించనున్నారు.  రూ.500/- చెల్లించి పుష్పయాగంలో పాల్గొనే గృహస్తులకు(ఇద్దరు) రవికె, ఉత్తరీయం బహుమానంగా అందజేస్తారు. శ్రీవారి పుష్పయాగాన్ని పురస్కరించుకుని మార్చి 19న తిరుప్పావ‌డ సేవ, 20న ఆర్జిత కల్యాణోత్సవం సేవలను టిటిడి రద్దు చేసింది.

Related Posts