YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కవితకు రాజ్యసభ సీటు..

కవితకు రాజ్యసభ సీటు..

కవితకు రాజ్యసభ సీటు..
హైద్రాబాద్, మార్చి9 
తెలంగాణలో రాజ్యసభ ఎన్నికల సందడి మొదలయ్యింది. అసెంబ్లీ సంఖ్యా బలం రిత్యా... తెలంగాణకు రెండు రాజ్యసభ సీట్లు దక్కనున్నాయి. అయితే ఆ రెండు కూడా ఇప్పుడు టీఆర్ఎస్ ఖాతాలో పడనున్నాయి. ఈ రెండు సీట్లను గులాబీ బాస్ ఎవరికి కట్టబెట్టనున్నారు? కేసీఆర్ మదిలో ఎవరున్నారు ? కూతురు కవిత కోసం కేసీఆర్ సీరియస్‌గా ఆలోచిస్తున్నారా లేదా ? ఒక వేళ కవితకు సీటు ఇవ్వకపోతే.. మరో నాలుగేళ్లు ఆమె పరిస్థితి ఏంటి ..? ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. 2014 ఎన్నికలతో పాటు... 2018 ఎన్నికల్లో కూడా కారు జోరు కొనసాగింది. దీంతో కేసీఆర్ అధికారం నడుస్తుంది. అయితే సీఎంగా ఉన్న కేసీఆర్... కుమారుడు కేటీఆర్‌కు మంత్రి పదవి ఇచ్చారు. అల్లుడు హరీష్ రావును కూడా ఆర్థిక మంత్రిని చేశారు. అటు కూతురు కవిత విషయంలోనే కేసీఆర్ మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతున్నారా ?నిజామాబాద్ ఎంపీగా ఎన్నికల బరిలోకి దిగిన కవిత... బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్‌పై ఓటమి పాలయ్యారు. దీంతో ఏడాది నుంచి కవిత సైలెంట్ అయిపోయారు. అధికారికంగా ఎలాంటి కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు. పంచాయతీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ప్రచారానికి కూడా ఆమె దూరంగా ఉన్నారు. పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో కూడా ఎక్కడా ఆమె కనిపించడం లేదు. తండ్రి అధికారంలో ఉన్నా... రాష్ట్రంలో పార్టీ హవా నడుస్తున్నా ఆమె మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ఒకవేళ కవిత వాక్ చాతుర్యం... ఢిల్లీలో పలువురు నేతలతో ఆమెకు ఉన్న సత్సంబంధాలు, హిందీ, ఇంగ్లీష్ భాషలపై ఉన్న పట్టు గుర్తించి పెద్దల సభకు కవితనే కేసీఆర్ పంపిస్తే ఓకే. లేదంటే మాత్రం మరి కొన్నాళ్లపాటు.. కవిత ఖాళీగానే ఉండాల్సిన పరిస్థితి. ఒక వేళ అదే జరిగితే ..కవితకు నాలుగేళ్లు మౌనదీక్ష తప్పదంటన్నారు రాజకీయ విశ్లేషకులు. కేసీఆర్ నిర్ణయంపైనే కవిత రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుదని చెబుతున్నారు. ఇప్పటికే పార్టీకి ప్రజలకు ఏడాది పాటు దూరమైన ఆమె... ఐదేళ్ల పాటు దూరమయ్యే పరిస్థితి వస్తోందంటున్నారు.మరోవైపు తెలంగాణకు ఉన్నవి రెండు సీట్లే అయినా... రాజ్యసభ రేసులో మాత్రం అనేకమంది నేతలు పోటీ పడుతున్నారు. సీనియర్ నేత కేకే... మరోసారి తననే పెద్దల సభకు పంపాలని కోరుతున్నారు. పార్టీ సెక్రటరీ జనరల్‌గా కూడా కేకే పనిచేస్తున్నారు. అయితే మరోసారి కేకేకు ఛాన్స్ ఇవ్వడం పట్ల పార్టీలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వయో భారం నేపథ్యంలో ఆయన సేవలు పార్టీకే వాడుకుంటూ బావుంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అటు... ఖమ్మం టికెట్ ఇవ్వకపోయినా... పార్టీకి విధేయుడిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సైతం రాజ్యసభ సీటు దక్కుతుందని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. రాజ్యసభకు వెళ్లేది పొంగులేటి అంటూ కేటీఆర్ ఆయనకు స్వయంగా చెప్పినట్లు కూడా సమాచారం. మరోవైపు మాజీ స్పీకర్ మధుసూదనాచారి కూడా రాజ్యసభ సీటు ఆశిస్తున్నారు. టీడీపీను వీడి టీఆర్ఎస్‌లో చేరిన మండవ వెంకటేశ్వర్రావు కూడా ఆశావహుల్లో ఉన్నారు. ఒకవేళ కవిత, పొంగులేటికి అవకాశం ఇస్తే... రెండు సీట్లు జనరల్ ఇచ్చారన్న తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయన్న భయం కూడా పార్టీలో ఉంది. ఇలా అనేక రాజకీయ సమీకరణల మధ్య కేసీఆర్ రాజ్యసభ సీటులు ఎవరికి కేటాయిస్తారన్నది ఉత్కంఠగా మారింది.

Related Posts