YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

బీసీలకు రిజర్వేషన్ల అంశంపై రగడ

బీసీలకు రిజర్వేషన్ల అంశంపై రగడ

బీసీలకు రిజర్వేషన్ల అంశంపై రగడ
విజయవాడ, మార్చి 9 
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల అంశంపై రగడ కొనసాగుతోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రిజర్వేషన్లలో కోత పెట్టిందని టీడీపీ ఆరోపిస్తుంటే.. బీసీలకు రిజర్వేషన్లు రాకుండా టీడీపీనే కోర్టులో కేసులు వేసిందని వైఎస్సార్‌సీపీ ఆరోపిస్తోంది. ఇరుపార్టీల నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అంతేకాదు టీడీపీ, వైఎస్సార్‌సీపీలో బీసీలకు 34శాతం రిజర్వేషన్లు బీసీలకు కేటాయిస్తామని చెబుతోంది. తాజాగా బీసీల రిజర్వేషన్ల అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు.తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాతే ఏపీలో సామాజిక న్యాయం వెల్లివిరిసింది అన్నారు చంద్రబాబు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు పెద్దసంఖ్యలో పదవులు ఇవ్వడమే కాకుండా.. బీసీలు, మహిళలకు రిజర్వేషన్లు కల్పించి, వారిని రాజ్యాధికారంలో భాగస్వాములను చేసిన ఘనత ఎన్టీఆర్‌కు దక్కుతుందన్నారు. బీసీలకు 1987లో 27%, 1995లో 34% రిజర్వేషన్లు ఇచ్చి వారి రాజకీయ సాధికారతకు నాందిపలికామన్నారు. సమాజంలో పెత్తందారీ పోకడలకు అడ్డుకట్టవేశామని.. అలా 33ఏళ్ళుగా బీసీలు పొందుతున్న పదవులకు కోతపెట్టి, మళ్ళీ పెత్తందారీ రాజ్యాన్ని తెచ్చే లక్ష్యంతోనే 34% బీసీ రిజర్వేషన్లను 24%కు తగ్గించింది వైఎస్సార్‌సీపీ అని ఆరోపించారు.కొన్ని జిల్లాలలో బీసీల రిజర్వేషన్లను సగానికి సగం కోత పెట్టడం దారుణమన్నారు టీడీపీ అధినేత. జెడ్పీటీసీ స్థానాల్లో నెల్లూరులో 13%, ప్రకాశంలో 19.64%, పశ్చిమ గోదావరిలో 18.75%, కృష్ణా 20.41%, తూర్పుగోదావరి 20.97%, విశాఖలో 20.51% కు బీసీలను పరిమితం చేశారని విమర్శించారు. చట్టసభల్లో, ప్రభుత్వ విధానాల్లో బీసీల భాగస్వామ్యాన్ని దూరం చేసే కుట్ర ఇదని.. వైఎస్సార్‌సీపీ పెత్తందారీ పోకడలపై, అణచివేతలపై ఆ పార్టీ ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలే కన్నీళ్లు పెట్టే పరిస్థితి ఉందన్నారు. బడుగు బలహీన వర్గాల హక్కులను వైఎస్సార్‌సీపీ కాలరాసినా, కాపాడేందుకు తెలుగుదేశం పార్టీ సిద్దంగా ఉందన్నారు చంద్రబాబు.అందుకే ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి 34% పైగా స్థానాలను బీసీలకు కేటాయించామని గుర్తు చేశారు మాజీ ముఖ్యమంత్రి. రాష్ట్రంలో సామాజిక న్యాయాన్ని పరిరక్షించుకునేందుకు బీసీలందరూ ఏకంకావాలని పిలుపు ఇచ్చారు. అంబేద్కర్ మాట, ఎన్టీఆర్ బాట, తెలుగుదేశం సిద్దాంతం... "సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్ళు" అన్నారు

Related Posts