టీడీపీకి మాజీ ఎమ్మల్సీ సతీష్ రెడ్డి రాజీనామా
కడప మార్చ్ 10
తెలుగుదేశం పార్టీకీ మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి రాజీనామా చేసారు. ఈమేరకు అయన మంగళవారం పులివెందుల నియోజకవర్గ ఇన్ ఛార్జి పదవి నుండి తప్పుకున్నట్లు ప్రకటించారు. వేంపల్లెలోని తన నివాసంలో కార్యకర్తల సమావేశంలో నిర్ణయం తీసుకున్న సతీష్ రెడ్డి తరువాత మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు నాపై నమ్మకం లేదు. అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నాను. తనకు చంద్రబాబుకు మధ్య అంతరం పెరిగిందని అన్నారు. పులివెందుల్లో ఎన్నికలు అంటే కత్తిమీద సామే. అలాంటి నియోజకవర్గంలో తాను టీడీపీకి సుధీర్ఘంగా అండగా ఉన్నాను. నాపై చంద్రబాబుకు నమ్మకం సన్నగిల్లింది. నమ్మకం లేని చోట నేను ఉండలేను. అందుకే పార్టీని వీడుతున్నానని వెల్లడించారు. నేను ఎక్కడ ఉన్నా కార్యకర్తలకు అండగా ఉంటాను. కార్యకర్తలతో సమీక్షించిన తరువాతనే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానని సతీష్ రెడ్డి అన్నారు.