YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ లో ఓటర్లుగా నమోదైన గవర్నర్ దంపతులు

ఆంధ్రప్రదేశ్ లో ఓటర్లుగా నమోదైన గవర్నర్ దంపతులు

ఆంధ్రప్రదేశ్ లో ఓటర్లుగా నమోదైన గవర్నర్ దంపతులు
అమరావతి మార్చ్ 10
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ఆంధ్రప్రదేశ్ లో ఓటు హక్కును పొందారు. ఆంధ్రప్రదేశ్ రాజ్ భవన్ విజయవాడ మధ్య నియోజక వర్గ పరిధిలో ఉండగా గవర్నర్ తో పాటు మహిళా గవర్నర్ సుప్రవ హరిచందన్ పైతం ఓటరుగా నమోదు అయ్యేందుకు అవసరమైన పత్రాలను ఎన్నికల అధికారులకు అందించారు. గవర్నర్ వారి కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా సూచనల మేరకు నియోజకవర్గ ఎన్నికల విభాగపు ఉప తహశీల్ధార్ నాగమణి మంగళవారం గవర్నర్ దంపతులకు సంబంధించిన ఓటరు నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేసారు.  అప్పటి కప్పుడే వివరాలను సరిచూసుకున్న అధికారులు జిల్లా పాలనాధికారి ద్వారా రాష్ట్ర ప్రధమ పౌరునికి అతి త్వరలోనే ఓటరు కార్డును అందచేస్తామని తెలిపారు. 

Related Posts