YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 హితం కోసమే పొత్తు

 హితం కోసమే పొత్తు

 హితం కోసమే పొత్తు
విశాఖపట్నం మార్చ్ 10
పవిత్ర పొత్తుగా భావిస్తున్న జనసేన , బీజేపీ రెండు పార్టీలు స్ధానిక సంస్ధల ఎన్నికల్లో అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకుంటున్నాయి. సామాజిక హితం కోసం  రెండు పార్టీలు కలసికట్టుగా బరిలొకి దిగుతున్నామని ప్రకటించిన ఇరు పార్టీ నేతలు విశాఖలో అజెండాను ప్రకటించారు. ఏపీలో రాజకీయాలు ధనార్జనే  ధ్యేయంగా కొనసాగుతున్న తరుణంలో వీటిని ప్రక్షాళన చేసేందుకు పోత్తు పెట్టుకున్నామని జనసేన నేత శివశంకర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పాలనలో అభివృద్ది స్ధంబించిపోయిందని అన్నారు. స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ఓటు అనే ఆయుదంతో ప్రజలు బీజేపీ,జనసేన కూటమికి అండగా నిలవాలని కోరారు.  స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ఉమ్మడి పోటీపై రాష్ట్ర సమన్వయ కమిటీ చర్చలు జరిపిందని చెప్పారు. స్ధానిక సంస్ధల ఎన్నికల్లో మొట్టమొదటి సారిగా బరిలోకి  రెండు పార్టీలు కలసి దిగుతున్నామని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ చెప్పారు. కుల రాజకీయాలు చేస్తూ ధనార్జనే ధ్యేయంగా పని చేస్తున్న ప్రభుత్వానికి ప్రజలు  ఈ ఎన్నికల ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియచెయ్యాలని కోరారు. 

Related Posts