లోయలో పడిన బస్సు…ఐదుగురు మృతి
షిమ్లా మార్చ్ 10
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని చంబా జిల్లాలోని చెహ్లీ గ్రామ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హిమాచల్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పోరేషన్ కు చెందిన బస్సు లోయలో పడటంతో జరిగిన ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, 35 మంది తీవ్రంగా గాయపడ్డురు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతులు యోగేశ్ కుమార్(47), పూజా కుమారి(28), రాజీవ్ కుమార్(37), మణిరామ్(33), దావాత్ అలీ(30)లుగా గుర్తించారు. చంబా నుంచి డెహ్రాడూన్ వెళుతున్న బస్సు ఉదయం 6:45 గంటలకు ప్రమాదానికి గురైంది.