ఎన్నికలకు ముందు ఓ మాట..తర్వాత మరో మాట కూరగాయలు దండలతో ప్రభుత్వానికి నిరసన రైతులు ఆందోళన
అమరావతి మార్చ్ 10
నవ్యాంధ్ర రాజధాని అమరావతినే కొనసాగించాలంటూ గత కొన్నిరోజులుగా రైతులు, రైతుకూలీలు పెద్ద ఎత్తున ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇవాళ రాజధాని ప్రాంతమైన పెదపరిమిలో కూరగాయలు దండలతో ప్రభుత్వానికి నిరసన రైతులు ఆందోళన చేపట్టారు. ‘జై అమరావతి’ అంటూ చేతులపై హెన్నా పెట్టుకుని ప్రదర్శనలు చేశారు. ‘ఎన్నికలకు ముందు అమరావతి ఇక్కడే.. నేను ఇక్కడే అని వైఎస్ జగన్ చెప్పారు. అందుకే మేం రాజధానిలోని రెండు నియోజకవర్గాల్లో వైసీపీకి ఓటేసి గెలిపించాం. అప్పుడలా మమ్మల్ని నమ్మించి మా చెవిలో చెవిలో పూలు పెట్టారు’ అని రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘ తీరా అధికారంలోకి వచ్చాక అమరావతి కాదు స్మశానం అంటున్నారు. ఇప్పుడు ఒక సామాజిక వర్గం పేరు చెప్పి అన్ని వర్గాల వారిని వీధుల పాలు చేశారు. ఇల్లు, పొలం తప్ప మరో లోకం తెలియని రైతులను లాఠీలతో కొట్టించారు. నమ్మంచి మోసం చేసిన జగన్.. మా చెవిలో పూలు పెట్టారు. అందుకే మేము పండించే కూరగాయలను మెడలో వేసుకుని నిరసన తెలిపాం’ అని రైతులు మీడియాకు వెల్లడించారు.