YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

మిడిల్ క్లాస్  నుంచి 200 కోట్ల వరకు...

మిడిల్ క్లాస్  నుంచి 200 కోట్ల వరకు...

మిడిల్ క్లాస్  నుంచి 200 కోట్ల వరకు...
నల్గొండ, మార్చి 10  
పేదరికం మీద కసికొద్దీ సంపాదించాడు. మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన అతడు కోట్లకు పడగెత్తాడు. అందరూ ఈర్ష్య పడేలా డబ్బు సంపాదించాడు. కిరోసిన్ వ్యాపారిగా జీవనం ప్రారంభించి.. క్రమంగా రైస్ మిల్లు వ్యాపారంలోకి.. అందులో సంపాదించిన డబ్బుతో రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. ఇక వెనుదిరిగి చూడలేదు. రూ.200 కోట్లకు పైగా ఆస్తులు సంపాదించాడు. అతడే.. మిర్యాలగూడ మారుతీరావు. మారుతీరావు ఆస్తుల చిట్టా విని పలువురు నోరెళ్లబెడుతుండగా.. అనధికారికంగా ఆస్తుల విలువ అంతకంటే ఎక్కువే ఉంటుందని మరి కొంత మంది చెబుతున్నారు.కూతురు కులాంతర వివాహాన్ని తీవ్రంగా వ్యతిరేకించి, మిర్యాలగూడలో పెరుమాళ్ల ప్రణయ్ అనే యువకుడిని దారుణంగా హత్య చేయించిన కేసులో మారుతీరావు ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. రెండు రోజుల కిందట హైదరాబాద్‌లోని ఆర్యవైశ్యా భవన్‌లో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన అంత్యక్రియలు సోమవారం (మార్చి 9) మిర్యాలగూడలో నిర్వహించారు. ప్రణయ్ హత్య కేసు ట్రయల్‌కు వస్తుండటంతో ఒత్తిడి గురై మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు.. తాజాగా మారుతీరావు ఆస్తుల వివరాలను న్యాయస్థానికి సమర్పించారు.ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం.. మారుతీరావు ఆస్తుల విలువ రూ.200 కోట్లు ఉంటుందని పోలీసుల నివేదికలో వెల్లడించారు. 15 ఏళ్ల కిందట ఆయన రైస్‌ మిల్లులు అమ్మి రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టాడని తెలిపారు. మిర్యాలగూడలో అమృత హాస్పిటల్ పేరుతో 100 పడకల ఆస్పత్రి ఉంది. పట్టణంలోనే ఆయన భార్య గిరిజ పేరుతో పది ఎకరాల భూమి కూడా ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.మిర్యాలగూడ బైపాస్‌ రోడ్డులో 22 గుంటల భూమి ఉంది. మిర్యాలగూడ, ఈదులగూడెం రోడ్‌లో షాపింగ్‌మాల్స్, మారుతీరావు తల్లి పేరు మీద రెండంతస్తుల షాపింగ్‌మాల్ కూడా ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. హైదరాబాద్‌లోని కొత్తపేటలో 400 గజాల ప్లాట్, వేర్వేరు చోట్ల 5 అపార్టుమెంట్లు ఉన్నాయి. శరణ్య గ్రీన్ హోమ్స్ పేరుతో మారుతీరావు, అతడి సోదరుడు శ్రవణ్ దాదాపు వంద విల్లాలు అమ్మినట్లు పోలీసుల విచారణలో తేలింది.మారుతీరావు ఆస్తులు ఎవరికి దక్కుతాయనేది ఇప్పుడు మరో హాట్ టాపిక్. కూతురు మీద ప్రేమతో అమృతను అతి గారాబంగా పెంచారు. అయితే.. కులాంతర వివాహం చేసుకుందని కోపంతో అల్లుడిని దారుణంగా చంపించారు. ఈ హత్య కేసులో 6 నెలలు జైల్లో ఉండి ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యారు. ఆ తర్వాత కేసు సయోధ్య కోసం కూతురితో ఎన్ని రకాలుగా రాయబారాలు జరిపినా, ఆమె వినలేదు. పైగా తండ్రిపై మరిన్ని కేసులు పెట్టింది. అయినా.. అమృతపై ఆయనకు ప్రేమ ఏమాత్రం తగ్గలేదు.తీవ్ర మనోవేదనకు గురై విషం తాగిన మారుతీరావు.. మరణించే చివరి నిమిషంలోనూ కుమార్తె అమృత గురించే ఆలోచించారు. ‘గిరిజా క్షమించు, అమృత అమ్మ దగ్గరకు రా’ అని రాసిపెట్టడం ఆయన తన భార్య, కుమార్తె గురించి ఎంత వేదన చెందారనేది తెలియజేస్తుంది. అయితే.. తండ్రి కడసారి చూపు కోసం శ్మశాన వాటికకు వెళ్లిన అమృతకు చేదు అనుభవమే ఎదురైంది. ‘అమృత గో బ్యాక్ అంటూ’ బంధువులు నినాదాలు చేయడంతో.. ఆమె వెనుదిరిగింది. ఈ నేపథ్యంలో మారుతీరావు ఆస్తి ఎవరికి దక్కుతుందనేది చర్చనీయాంశంగా మారింది.మారుతీరావు తన భార్య, తమ్ముడు శ్రవణ్ పేరు మీద 2018లోనే వీలునామా రాసినట్టు సమాచారం. అయితే.. జైలుకు వెళ్లొచ్చిన తర్వాత ఆ వీలునామా రద్దు చేయించి మరొకటి రాసినట్లు తెలుస్తోంది. మారుతీరావుకు బినామీలు కూడా ఉన్నట్లు అమృత చెప్పింది. బినామీల పేరు మీద ఇంకెంత ఆస్తి ఉందనేది కూడా తెలియాల్సి ఉంది.

Related Posts