YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 పవన్ కళ్యాణ్‌కు షాక్..

 పవన్ కళ్యాణ్‌కు షాక్..

 పవన్ కళ్యాణ్‌కు షాక్..
విశాఖపట్టణం, మార్చి10 
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. 2019 ఎన్నికల తర్వాత ఘోర ఓటమితో ఇప్పటికే చాలా మంది నేతలు పార్టీని వీడారు. తాజాగా విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ నేత పసుపులేటి బాలరాజు ఇటీవలే జనసేన పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు పంపారు. తాజాగా ఆయన వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆయనతో పాటూ మరికొందరు కూడా కండువాలు కప్పుకున్నారు.బాలరాజు 2019 ఎన్నికల్లో విశాఖ జిల్లా పాడేరు నియోజకవర్గం నుంచి జనసేన తరఫున అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసి వైఎస్సార్సీపీ అభ్యర్థి భాగ్యలక్ష్మి చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. బాలరాజు పార్టీ మారతారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. జనసేనకు రాజీనామా చేస్తే ఏ పార్టీలోకి వెళ్తారన్న విషయంపైనా కొద్దికాలం చర్చ నడిచింది. చివరికి అధికార పార్టీలోకి జంప్ కొట్టారు.పసుపులేటి బాలరాజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా పనిచేశారు. అంతేకాదు వైఎస్‌కు సన్నిహితుడిగా పేరుంది.. గతంలోనే ఆయన వైఎస్సార్సీపీలో చేరతారని అనుకున్నప్పటికీ అలా జరగలేదు. గిరిజన వర్గాల్లో పట్టున్న నాయకుడిగా పేరు తెచ్చుకున్న బాలరాజు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1989లో అప్పటి చింతపల్లి నియోజవర్గం నుంచి గెలిచి పేరు తెచ్చుకున్నారు. అనంతరం 2009లో పాడేరు నుంచి విజయం సాధించి వైఎస్, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు.

Related Posts