YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం

కేరళలో పెరుగుతున్న కోవిడ్ బాధితులు, స్కూళ్లకు సెలవులు

కేరళలో పెరుగుతున్న కోవిడ్ బాధితులు, స్కూళ్లకు సెలవులు

కేరళలో పెరుగుతున్న కోవిడ్ బాధితులు, స్కూళ్లకు సెలవులు
తిరువనంతపురం, మార్చి 10  
కేరళలో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంపై విజయన్ సర్కారు అప్రత్తమయ్యింది. కొత్తగా 12 కోవిడ్ కేసులు నిర్ధారణ కావడంతో ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ మంగళవారం అత్యవసరంగా క్యాబినెట్ సమావేశం ఏర్పాటుచేశారు. మార్చి 31 వరకు అన్ని విద్యా సంస్థలను మూసివేయాలని నిర్ణయించారు. అయితే, ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఈ నిబంధనలు సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ స్కూల్స్‌కు వర్తిస్తాయని క్యాబినెట్ భేటీలో నిర్ణయించారు. ఇప్పటి వరకూ కేరళలో 15 కేసులు నమోదు కాగా, వుహాన్ నుంచి వచ్చిన ముగ్గురు మెడికల్ స్టూడెంట్స్ కోలుకుని ఇళ్లకు వెళ్లారు.కేరళలో మంగళవారం కొట్టాయంలో నాలుగు, పత్తనంథిట్టాలో రెండు మొత్తం కొత్తగా ఆరు కోవిడ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. కొట్టాయంకి చెందిన ముగ్గురు ఇటలీ పర్యటనకు వెళ్లిరాగా కోవిడ్ బారినపడ్డారు. తాజాగా, వారి తల్లిదండ్రులకు వైరస్ ఉన్నట్టు తేలింది. దీంతో కొట్టాయం మెడికల్ కాలేజీలో వీరిని చేర్పించి ఐసోలేషన్ వార్డులో చికిత్స అందజేస్తున్నారు. పత్తనంథిట్టాకు చెందిన ఇద్దరికీ కూడా వైరస్ ఈ విధంగానే సోకింది. కరోనా బాధితుడితో వీరు సన్నిహితంగా ఉండటంతో వైరస్ సంక్రమించింది. బాధితులను కోజన్‌చెరీ హాస్పిటల్‌కు తరలించారు. రెండేళ్ల చిన్నారికి కూడా కరోనా వైరస్ నిర్ధారణ కాగా, హై రిస్క్ కేటగిరీగా గుర్తించారు.యర్నాకులంలో మూడేళ్ల బాలుడి కరోనా వైరస్ ఉన్నట్టు సోమవారం గుర్తించిన విషయం తెలిసిందే. ఈ బాలుడి తల్లిదండ్రుల రక్త నమూనాలను కూడా పరీక్షలకు పంపగా, ఫలితాలు రావాల్సి ఉంది. వీరు కూడా ఇటలీ నుంచే వచ్చినట్టు అధికారులు తెలిపారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి అత్యున్నత జాగ్రత్తలు అవసరమని, అందువల్ల సామూహిక సమావేశాలకు దూరంగా ఉండాలని ముఖ్యమంత్రి విజ్ఞ‌ప్తి చేశారు.ఆలయాలు, మసీదు, చర్చిలు వద్ద పెద్ద సంఖ్యలో జనం చేరకుండా చూడాలని అన్నారు. అలాగే ప్రభుత్వ కార్యక్రమాలను కూడా మార్చి 31 వరకు రద్దుచేశారు. అలాగే థియేటర్లను కూడా మూసివేయాలని కోరారు. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోడానికి ప్రజలు సహకరించాలని, పెద్ద సంఖ్యలో గుమిగూడి ఉండకపోవడం మంచిదన్నారు. అలాగే, కోచింగ్ సెంటర్లు, ప్రత్యేక తరగతులు, ట్యూషన్ కేంద్రాలను కూడా మూసివేయాలని ఆదేశించారు.

Related Posts