YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

 అజ్ఞాత విరాళాలు 11, 234 కోట్లు

 అజ్ఞాత విరాళాలు 11, 234 కోట్లు

 అజ్ఞాత విరాళాలు 11, 234 కోట్లు
న్యూఢిల్లీ, మార్చి 10  
దేశంలోని రాజకీయ పార్టీలు అజ్ఞాత మార్గాల ద్వారా రూ. 11,234 కోట్లను విరాళాలుగా అందుకున్నాయని ఎన్నికల నిఘా సంస్థ అసోసియేషన్ ఆప్ డెమొక్రాటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) వెల్లడించింది. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లతో పాటు వామపక్షాలు, తృణమూల్ కాంగ్రెస్ వంటి ప్రాంతీయ పార్టీలు కూడా అజ్ఞాత విరాళాల స్వీకరణలో పోటీ పడుతున్నాయయని ఏడీఆర్ పేర్కొంది.దేశంలోని జాతీయ పార్టీలు గత 15 ఏళ్ల కాలంలో అంటే  2004-05 నుంచి 2018-19 వరకూ అజ్ఞాత వ్యక్తులు, సంస్ధల నుంచి రూ 11,234 కోట్ల విరాళాలను అందుకున్నాయని ఎన్నికల నిఘా సంస్థ అసోసియేషన్‌ ఆఫ్‌ డెమొక్రటిక్‌ రిఫామ్స్‌ (ఏడీఆర్‌) నివేదిక వెల్లడించింది. ఏడు జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, సీపీఐ(ఎం), సీపీఐ, ఎన్సీపీ, బీఎస్పీలు ఈసీకి సమర్పించిన వివరాలను పరిశీలించిన మీదట ఏడీఏ ఈ నివేదికను రూపొందించింది. రూ 20000 కంటే తక్కువ విలువైన విరాళాలను పార్టీలు అజ్ఞాత వ్యక్తులు, సంస్థల నుంచి వచ్చిన నిధులుగా ఆయా పార్టీలు ఐటీ రిటన్స్‌లో పేర్కొంటాయి. ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా విరాళాలు, కూపన్ల అమ్మకాలు, రిలీఫ్‌ ఫండ్‌, ఇతర ఆదాయం, స్వచ్ఛంద విరాళాలు, సమావేశాలు, మోర్చాల్లో వసూలైన మొత్తాలు వంటి రాబడిని అజ్ఞాత మార్గాల ద్వారా వచ్చిన ఆదాయంగా పరిగణిస్తారు.2004-05 నుంచి 2018-19 వరకూ జాతీయ రాజకీయ పార్టీలు రూ 11,234 కోట్లు ఈ మార్గాల ద్వారా సమీకరించినట్టు ఏడీఆర్‌ వెల్లడించింది. ఇక 2018-19లో రూ 1612 కోట్లు ఈ మార్గం ద్వారా వచ్చినట్టు బీజేపీ వెల్లడించింది. ఆ ఏడాది రాజకీయ పార్టీలకు వచ్చిన అజ్ఞాత నిధుల్లో (రూ 2512 కోట్లు) ఇవి 64 శాతం కావడం గమనార్హం.  ఇక కాంగ్రెస్‌ పార్టీ రూ 728.88 కోట్లు అజ్ఞాత వ్యక్తులు, సంస్ధల నుంచి నిధులను సమీకరించినట్టు పేర్కొంది. ఇక 2004-05 నుంచి 2018-19 వరకూ కాంగ్రెస్‌, ఎన్సీపీలు కూపన్ల అమ్మకం ద్వారా ఉమ్మడిగా ఆర్జించిన మొత్తం రూ 3902.63 కోట్లని ఏడీఆర్‌ పేర్కొంది.తమకు అజ్ఞాత వ్యక్తులు, గుర్తుతెలియని సంస్థల నుంచి రూ.1612.04కోట్ల విరాళాలు వచ్చాయని  అధికార బీజేపీ ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన రూ.728.88 కోట్ల విరాళాల్లో 29 శాతం అజ్ఞాత వ్యక్తులు, గుర్తుతెలియని సంస్థల నుంచి వచ్చాయి. కాంగ్రెస్, ఎన్సీపీలు కూపన్ల విక్రయాల ద్వారా రూ.3,902.63 కోట్ల విరాళాలు వచ్చాయని ప్రకటించాయి. మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ తమకు స్వచ్ఛందంగా ఎలాంటి విరాళాలు రాలేదని ప్రకటించింది.కాంగ్రెస్ పార్టీతో సహా అయిదు జాతీయ పార్టీలకు వచ్చిన విరాళాలతో పోలిస్తే (రూ. 900.94 కోట్లు) బీజేపీకి 1.5 రెట్ల అధికంగా అజ్ఞాత మార్గాల నుంచి విరాళాలు రావడం గమనార్హం

Related Posts