YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

 భర్తను చంపేసి రోడ్డు మీద పడేసి

 భర్తను చంపేసి రోడ్డు మీద పడేసి

 భర్తను చంపేసి రోడ్డు మీద పడేసి
లక్నో, మార్చి 11
అక్రమ సంబంధాలు కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నాయి. అనుమానం, పరాయి వ్యక్తిపై మోజుతో కట్టుకున్న వాళ్లనే కిరాతకంగా చంపేందుకు కూడా వెనుకాడడం లేదు. ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా చంపేసిన భార్య ఉదంతం వెలుగుచూసింది. ఈ అమానుష ఘటన యూపీలో చోటుచేసుకుంది. మొహమ్మద్‌పూర్ పరిధిలోని చార్‌బాగ్ ప్రాంతానికి చెందిన ధ్యాన్ సింగ్, ఆర్తీ సింగ్.భర్త ధ్యాన్ సింగ్ కూలీ పనులకు వెళ్తుంటాడు. రోజూ మద్యం తాగి వస్తుండడంతో భార్య నిత్యం గొడవపడుతుండేది. ఈ నేపథ్యంలో ఆమెకు ప్రేమ్ సింగ్ అనే వ్యక్తితో అక్రమం సంబంధం ఏర్పడింది. భర్త లేని సమయంలో ఆర్తీ సింగ్ ప్రియుడితో రాసలీలలు సాగించేది. ప్రేమ్ సింగ్‌కి అప్పటికే వివాహమై ఒక కొడుకు కూడా ఉన్నాడు. అయినా ఇద్దరూ అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేసేవారు.ఇద్దరి సంబంధానికి అడ్డువస్తున్నాడని భావించిన భార్య ప్రియుడితో కలసి భర్తను అంతమొందించాలని ప్లాన్ చేసింది. భర్తను దారుణంగా చంపేసి రోడ్డు పక్కన పడేసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆరా తీశారు. భార్య ప్రవర్తనపై అనుమానం రావడంతో ఆ దిశగా దర్యాప్తు చేపట్టడంతో ప్రియుడితో కలసి ఆమే భర్తను మట్టుబెట్టినట్లు తేలడంతో ఇద్దరినీ అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు.

Related Posts