ఊపందుకున్ననామినేషన్ల పర్వం
శ్రీకాకుళం మార్చి 11
శ్రీకాకుళం జిల్లా లోని 38 మండల పరిధిలో జడ్పిటిసి ఎంపిటిసి నామినేషన్ పర్వం ఊపందుకుంది. చివరి రోజు కావడంతో వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారు. కార్యకర్తలు అభిమానులు, నామినేషన్ వేసే కేంద్రాల వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు . జిల్లాకు చెందిన మంత్రులు శాసనసభ్యులు, వారివారి అభ్యర్థి ఎంపికలో బి ఫారంలు అందించారు. గెలుపే లక్ష్యంగా అటు తెలుగుదేశం ఇటు వైకాపా పార్టీలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఎక్కడా ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు అభిమానుల చేరుకున్నారు. చివరి రోజు కావడంతో అభ్యర్థులంతా నామినేషన్ వేసేందుకు ఎన్నికల అధికారుల ముందు చేరుకున్నారు. జిల్లాల ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారం కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.