YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఊపందుకున్ననామినేషన్ల పర్వం 

ఊపందుకున్ననామినేషన్ల పర్వం 

 ఊపందుకున్ననామినేషన్ల పర్వం 
శ్రీకాకుళం మార్చి 11 
శ్రీకాకుళం జిల్లా లోని 38 మండల పరిధిలో జడ్పిటిసి ఎంపిటిసి నామినేషన్ పర్వం ఊపందుకుంది. చివరి రోజు కావడంతో వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారు. కార్యకర్తలు అభిమానులు, నామినేషన్ వేసే కేంద్రాల వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు . జిల్లాకు చెందిన మంత్రులు శాసనసభ్యులు, వారివారి అభ్యర్థి ఎంపికలో బి ఫారంలు అందించారు. గెలుపే లక్ష్యంగా అటు తెలుగుదేశం ఇటు వైకాపా పార్టీలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఎక్కడా ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు అభిమానుల చేరుకున్నారు. చివరి రోజు కావడంతో అభ్యర్థులంతా నామినేషన్ వేసేందుకు ఎన్నికల అధికారుల ముందు చేరుకున్నారు. జిల్లాల ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారం కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.

Related Posts