బీటెక్ రవికి పులివెందుల నియోజక వర్గ టీడీపీ ఇంఛార్జి బాధ్యతలు
కడప మార్చ్ 11
కడప జిల్లా పులివెందుల నియోజక వర్గ టీడీపీ ఇంఛార్జి బాధ్యతలను అధిష్టానం ఎమ్మెల్సీ బీటెక్ రవికి అప్పగించింది. ఈ సందర్భంగా బీటెక్ రవి మాట్లాడుతూ సతీష్ రెడ్డి తీసుకున్న నిర్ణయం చాలా బాధాకరమని అన్నారు. ఆయన రాజీనామాతో టీడీపీ బలహీనపడదని, ఎవరు భయపెట్టిన వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని బీటెక్ రవి అన్నారు.పోటీ లేకుండా ఏకగ్రీవం చేసుకునే దిశగా వైసీపీ పోలీసులతో కేసులు పెట్టిస్తామంటూ అక్రమాలకు పాల్పడుతోందని ఆయన అన్నారు. అన్ని వర్గాల్లోనూ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని, ఈ ఒక్కటి చాలు చంద్రబాబు ఇంట్లో కూర్చొని గెలుస్తారని ఆయన అన్నారు. సతీష్ రెడ్డి ఎప్పుడు తిరిగొచ్చినా పార్టీలోకి ఆహ్వానిస్తామని ఆయన తెలిపారు.