YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వాళ్లిద్దరు చనిపోతే ఎవరు బాధ్యత వహిస్తారు

వాళ్లిద్దరు చనిపోతే ఎవరు బాధ్యత వహిస్తారు

వాళ్లిద్దరు చనిపోతే ఎవరు బాధ్యత వహిస్తారు
 బోండా ఉమ, బుద్ధాలపై దాడిపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
అమరావతి మార్చ్ 11 
టీడీపీనేతలపై జరిగిన దాడిని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖండించారు. రాష్ట్రంలో ఎవరూ బతకడానికి వీళ్లేదా?  మనుషులను చంపేస్తూ రాజకీయాలు చేస్తారా?  వెల్దుర్తి సీఐ కారును అడ్డగించారు. ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో చూస్తున్నామని అన్నారు. బుద్దా వెంకన్న, బోండా ఉమ చనిపోతే ఎవరు బాధ్యత వహిస్తారని అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూతమ నేతల కారును వెంబడించి దాడి చేశారని చంద్రబాబు తెలిపారు. కశ్మీర్, బిహార్లోనూ ఎన్నడూ ఇటువంటి ఘటనలు చోటు చేసుకోలేదని చెప్పారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇటువంటి దాడి చూడలేదని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో స్వేచ్ఛ లేదా? అని ప్రశ్నించారు. పంచాయతీ కార్యదర్శులను కూడా బంధిస్తున్నారు.  ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి గెలవాలనుకుంటున్నారు. మాచర్లలో దాడిపై డీజీపీ సమాధానం చెప్పాలి.  ఇంత జరుగుతున్నా ఆయనకు మకుట్టినట్లయినాలేదు.  మాట్లాడితే ఎదురుదాడి చేస్తారా? నామినేషన్లు వేయకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారు' అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు

Related Posts