కర్ణాటక పీసీసీ అధ్యక్షుడిగా డీకే శివ కుమార్
న్యూఢిల్లీ, మార్చి 11
కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడిగా ట్రబుల్ షూటర్ డీకే శివ కుమార్ను ఆ పార్టీ అధిష్ఠానం నియమించింది. కేపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ముగ్గుర్ని నియమించింది. బుధవారం పార్టీ విడుదల చేసిన ఓ ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపింది. ఈశ్వర్ ఖండ్రే, సతీశ్ జర్కిహోలీ, సలీం అహ్మద్లను కేపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించింది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కర్ణాటక శాసన సభలో ప్రతిపక్ష నేతగా, కాంగ్రెస్ శాసన సభా పక్ష నేతగా కొనసాగుతారని పేర్కొంది.