YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆరోగ్యం దేశీయం

భారత్ లో 62కు చేరిన కరోనా బాధితులు

భారత్ లో 62కు చేరిన కరోనా బాధితులు

భారత్ లో 62కు చేరిన కరోనా బాధితులు
న్యూఢిల్లీ, మార్చి 11 
భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 62కి చేరుకుంది. బుధవారం (మార్చి 11) ఢిల్లీలో ఒకటి, రాజస్థాన్‌లో మరొకటి కొత్త కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 62కి చేరినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కేరళలో కరోనా కేసుల సంఖ్య 17కి చేరుకుంది. రాజస్థాన్‌లోనూ కరోనా బారినపడ్డ వారి సంఖ్య 17కి పెరిగింది. దేశంలో కరోనా కేసులు నమోదైన రాష్ట్రాల్లో తొలి స్థానంలో ఇవే ఉన్నాయి. అయితే.. రాజస్థాన్‌లో కరోనా బారిన పడ్డ వారిలో 16 మంది విదేశీయులే (ఇటలీ) కావడం గమనార్హం.కరోనా అనుమానిత లక్షణాలతో కర్ణాటకకు చెందిన ఓ వృద్ధుడు (76) మృతి చెందాడు. కలబుర్గికి చెందిన ఇతడు ఫిబ్రవరి 29న సౌదీ అరేబియా నుంచి తిరిగొచ్చాడు. కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయణ్ని గుల్‌బర్గా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చేర్పించారు. అనంతరం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చేర్పించగా.. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మరణించాడు. అయితే.. ఆయన కరోనా వైరస్ కారణంగానే మృతి చెందారా అనేది నిర్ధారించాల్సి ఉంది. కరోనా వల్లే మృతి చెందితే భారత్‌లో తొలి కరోనా మృతి అవుతుంది.
దేశంలో కరోనా కేసులు:
జమ్ము కాశ్మీర్ - 1
లద్దాక్ - 2
రాజస్థాన్ - 17
ఢిల్లీ - 4
మహారాష్ట్ర - 5
ఉత్తర ప్రదేశ్ - 8
కర్ణాటక - 4
కేరళ - 17
తమిళనాడు - 1
తెలంగాణ - 1
మొత్తం కేసులు - 62
ఏపీలో తొలిసారిగా.. ఏపీలోని నెల్లూరులో కరోనా లక్షణాలతో ఓ యువకుడు ఆస్పత్రిలో చేరాడు. ప్రాథమిక పరీక్షలో అతడికి కరోనా అని తేలింది. అతడి నమూనాలను పుణే వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు. ఆ రిపోర్డు వస్తే.. కరోనా వైరసేనా అనేది నిర్ధారితమవుతుంది. బాధిత యువకుడు ఇటీవలే ఇటలీ నుంచి తిరిగొచ్చినట్లు తెలుస్తోంది. కరోనా వార్తలతో ఏపీలో కలకలం రేగుతోంది.కేరళలో కరోనా కేసులు 17కి చేరుకున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్‌ వ్యాప్తి ఎక్కువ అవుతుండటంతో రాష్ట్రంలోని పాఠశాలలు మార్చి 31 వరకు మూసివేయాలని సీఎం పినరయి విజయన్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. కేరళ సినీ పరిశ్రమ కూడా ఇదే బాటలో నడుస్తూ థియేటర్లను మార్చి 31 వరకు మూసేస్లున్నట్లు ప్రకటించింది.కరోనా వైరస్ భయం వెంటాడుతున్న వేళ శబరిమల దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి నెల ముగిసే వరకు ఆలయానికి రావొద్దని భక్తులకు విజ్ఞప్తి చేసింది. అయితే.. ఆలయంలో నెలవారి పూజా కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు ప్రెసిడెంట్ ఎన్ వాసు స్పష్టం చేశారు. ఇతర ఆలయాలు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు కరోనా వైరస్ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్‌ఆర్‌ఐలు భారత్‌కు వచ్చిన 28 రోజుల వరకు తిరుపతికి రావొద్దని కోరింది. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

Related Posts