YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎంపీ.. అధిష్ఠానం ఖరారు

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎంపీ.. అధిష్ఠానం ఖరారు

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎంపీ.. అధిష్ఠానం ఖరారు
హైద్రాబాద్, మార్చి 11
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర బీజేపీ అధిష్ఠానం ఆయన పేరును ఖరారు చేసింది. ప్రస్తుతం ఈయన కరీంనగర్ ఎంపీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, గత కొంత కాలంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని మార్చుతారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో అధ్యక్ష స్థానం కోసం పలువురు ఆశావహులు పోటీ పడ్డారు. ఇందులో భాగంగా పలువురి పేర్లు పరిశీలనకు వచ్చాయి. పార్టీ అధిష్ఠానం నుంచి పరిశీలకులు అనీల్ జైన్ తదితరులు తెలంగాణకు వచ్చి ఇక్కడి నేతల అభిప్రాయాలను కూడా తీసుకున్నారు. ఈసారి కూడా లక్ష్మణ్‌నే అధ్యక్షుడిగా కొనసాగిస్తారన్న ప్రచారమూ సాగింది. వివిధ నేతల నుంచి అభిప్రాయాలు తీసుకున్న అనంతరం బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ పేరును ఖరారు చేశారు.బండి సంజయ్ ఏబీవీబీ కార్యకర్త స్థాయి నుంచి రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టారు. ఈయనకు ఆర్ఎస్ఎస్ నేపథ్యం కూడా ఉంది. లక్ష్మణ్‌తో పాటు డీకే అరుణ, మురళీధర్ రావు, పేరాల శేఖర్ రావు తదితరుల పేర్లు కూడా అధ్యక్ష పదవి రేసులో వినిపించినా చివరికి బండి సంజయ్ వైపే అధిష్ఠానం మొగ్గు చూపింది.

Related Posts