YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

 రేవంత్ కు మళ్లీ నిరాశే

 రేవంత్ కు మళ్లీ నిరాశే

 రేవంత్ కు మళ్లీ నిరాశే
హైద్రాబాద్, మార్చి 11 
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డికి కూకట్‌పల్లి కోర్టులో చుక్కెదురైంది. ఆయన బెయిల్ పిటిషన్‌పై బుధవారం (మార్చి 11) విచారణ చేపట్టిన న్యాయస్థానం కొట్టేసింది. శంకర్‌పల్లి కానోజీగూడ వద్ద కేటీఆర్ ఫామ్‌హౌస్‌పై డ్రోన్ కెమెరా ఎగరేశారనే ఆరోపణలపై రేవంత్ రెడ్డిపై నార్సింగి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఉప్పర్‌పల్లి న్యాయస్థానం ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించగా.. పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. చర్లపల్లి జైలులో రేవంత్ రెడ్డి రిమాండ్ ఖైదీగా ఉన్నారు.గండిపేట చెరువుకు వెళ్లే దారిలో ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అక్రమంగా ఫామ్‌ హౌస్‌ నిర్మించారని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో పాటు పలువురు అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి సోమవారం (మార్చి 2) మధ్యాహ్నం ఫామ్ హౌస్ ముట్టడికి యత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు, మార్గమధ్యలో జన్వాడ వద్ద నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు కేటీ‍ఆర్‌ చట్టాలను ఉల్లంఘించి అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. 111 జీవోను అతిక్రమించి మంత్రి కేటీఆర్ అక్రమంగా ఫామ్ హౌస్ నిర్మించారని.. కేంద్ర ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి 25 ఎకరాల్లో ఫామ్ హౌస్ నిర్మాణం చేపట్టారని ఆరోపించారు. ఇదే సమయంలో కేటీఆర్ ఫార్మ్‌హౌస్‌ను కొంత మంది డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించారు.కేటీఆర్‌ ఫామ్‌హౌస్‌పై డ్రోన్‌ ఎగురవేసిన కేసులో నార్సింగి పోలీసులు 8 మందిని నిందితులుగా చేర్చి అరెస్ట్‌ చేశారు. గత విచారణలో ఆరుగురికి రాజేంద్రనగర్‌ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న రేవంత్‌ రెడ్డికి కూడా బుధవారం బెయిల్‌ వస్తుందని భావించగా.. నిరాశే దక్కింది.

Related Posts