చలో అసెంబ్లీ పోస్టర్ ఆవిష్కరణ ....
మార్చి 12
తాండూరు మండలం జడ్పిఎస్ ఎస్ తంగళ్లపల్లి పాటశాలలొ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్స్, పబ్లిక్ సెక్టార్ & కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్య వేదిక మార్చి 13 వ తేదీన నిర్వహించే చలో అసెంబ్లీ కార్యక్రమం కోసం పోస్టర్ ఆవిష్కరణ చేశారు ఈసందర్బంగా జిల్లా నాయకులు మాట్లాడుతూ పీఆర్సీ ఇవ్వాలని, సీపీఎస్ రద్దుచేసి పాత పెన్షన్ ఇవ్వాలి , పదవి విరమణ వయస్సు పెంచి , సమాన పనికి సమాన వేతనం, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, ఉపాద్యాయుల పదోన్నతులు ఇవ్వాలి, పండిత్ & పిఈటీ పోస్ట్లు అప్ గ్రేడ్ చేయాలి. ఈ సమస్యల పరిష్కారం కోసం చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు స్వచ్చందంగా తరలి వచ్చి ఉద్యోగ ఉపాధ్యాయుల వాదనను, వేదనను బలంగా వినిపించాలని, అధిక సంఖ్యలో వచ్చి సింహగర్జన చేయాలనీ, ఆ గర్జన ప్రభుత్వాన్ని కదిలించేవిదంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలొ జె ఏ సి జిల్లా నాయకులు వి. శాంత కుమారి, ప్రకాష్, నరేందర్, భరత్ మండల నాయకులు, చక్రపాణి, సంపత్, శివానంద్, విశ్వనాథ్, దేవదాస్ , , శ్రీనివాస్, మండల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.