YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

.ముగిసిన నామినేషన్ల పర్వం

.ముగిసిన నామినేషన్ల పర్వం

.ముగిసిన నామినేషన్ల పర్వం
మార్చి 12
స్థానిక సంస్థల ఎన్నికలకు నేటితో నామినేషన్ల పర్వం ముగిసింది.బుధవారం మండల పరిషత్ కార్యాలయం నందు ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీహరి ఆధ్వర్యంలో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది.మండల పరిధిలోని వివిధ గ్రామాల నుండి వివిధ పార్టీల వారు వారి వారి అభ్యర్థులను నామినేషన్లు వేయించేందుకు తుగ్గలి గ్రామానికి చేరుకున్నారు.మండల పరిషత్ కార్యాలయం ముందు అభ్యర్థులు వారి మద్దతుదారులతో కిక్కిరిసి పోయింది.ఈ సందర్భంగా తుగ్గలి మరియు జొన్నగిరి పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు నిర్వహించారు.అభ్యర్థి తో పాటు మరో ఇద్దరిని ఎన్నికల అధికారి దగ్గరకు పంపుతూ నియంత్రించారు.మండల కార్యాలయం అధికారులు అభ్యర్థుల నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి ఎన్నికల అధికారి వద్దకు పంపించారు.దీనితో అభ్యర్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా నామినేషన్లను వేశారు. నామినేషన్ల సమయం ముగిసే సరికి 17 ఎంపీటీసీ స్థానాలకు గాను 89 మంది నామినేషన్లు వేశారు.అన్ని స్థానాలలో ప్రధాన పార్టీల ప్రధాన పార్టీలైన వైసిపి,టిడిపి మరియు పలువురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు. అన్ని స్థానాల్లో కొన్ని స్థానాలలో బీజేపీ, సిపిఐ మరియు జనసేన అభ్యర్థులు నామినేషన్లు వేశారు.

Related Posts