నిమోజకవర్గ అభివృద్ది కోసమే పార్టీ మార్పు
ప్రకాశం, మార్చి 12,
చీరాల నియోజకవర్గ అభివృద్ధి కోసం వైసీపీ లో చేరుతున్నట్లు చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు... చీరాల మండలం రామకృష్ణాపురం లోని కరణం బలరామకృష్ణమూర్తి స్వగృహంలో మీడియాతో మాట్లాడారు కార్యకర్తల అభీష్టం మేరకు అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని వైకాపాలోకి చేరుతున్నానని తనతోపాటు ప్రధాన అనుచరులు తెదేపా నాయకులు ఎవరు జారతాది అనేది తాడేపల్లిలో పర్యటిస్తానని బలరాం కృష్ణ మూర్తి తెలిపారు.. తాడేపల్లి లో మంత్రి బాలినేనిశ్రీనివాసరెడ్డి నివాసం నుండి బాలినేని తో కలసి వెళ్లి ముఖ్యమంత్రి సమక్షంలో పార్టీ తీర్ధం పుచుకొనున్నట్లు బలరాం తెలిపారు..ముందుగా కార్యకర్తల తో సమావేశం ఏర్పాటు చేసి పార్టీ మారడానికి గల కారణాలను వివరించినట్లు సమాచారం