పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీకి షాక్...
ఏలూరు, మార్చి 12
గత పది సంవత్సరాలుగా పార్టీకి సేవలందించిన బొద్దాని శ్రీనివాస్ ని పక్కనపెట్టిన వైసిపి, టిడిపిలో నుంచి ఇటీవల వచ్చిన మాజీ మేయర్ నూర్జహాన్ కి తిరిగి అవకాశం ఇవ్వడంతో వైకాపాలో అసమ్మతి బయటపడింది, ఏలూరు మేయర్ గా నూర్జహాన్ వైసిపి ప్రకటించడం బాధగా ఉందన్న శ్రీనివాస్, తన అనుచరులతో నిరసనకు దిగారు, పార్టీ ఆవిర్భావం నుంచి సేవలందించిన తనకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదంటూ మంత్రి ఆళ్ల నాని ఇంటి ముందు బైఠాయించారు. గతంలో కుడా మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని కూడా వదులుకున్నాని అయన వాపోయారు. మంత్రి ఆళ్ల నాని ఇంటి వద్ద నిరసనకారులు బైటాయించడంతోపోలీసులు భారీగా మోహరించారు,