.వైసీపీ 90 శాతం విజయం సాధిస్తుంది
మార్చి 12
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల విజయంపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ పోరులో వైసీపీ 90 శాతం వైసీపీ అభ్యర్థులు విజయం సాధిస్తారని అన్నారు. అందుకు సీఎం జగన్ తొమ్మిది నెలల పాలనే విజయాన్ని చేరుస్తుందని చెప్పారు. సంక్షేమ పథకాలకు ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందనే వైసీపీ అభ్యర్ధులకు విజయాన్ని అందిస్తుందని చెప్పారు. నామినేషన్లు వేసేందుకు చివరి రోజు కావడంతో మంత్రి బాలినేని శ్రీనివాస్ సమక్షంలో నామినేషన్లు దాఖలు చేశారు. వీరితో పాటు ఇతర పార్టీలకు చెందిన అభ్యర్ధులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు.