జగన్ హాయంలో పాలన ఏకపక్షంగా కొనసాగుతోంది
విశాఖ, మార్చి 12
విశాఖలో మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలకు నామినేషన్లు పర్వం ఊపందుకుంది. నామినేషన్లు ధాఖలు చేసేందుకు ఇంకా కొద్ది గంటలు మాత్రమే గడువు ఉండడంతో చివరి క్షణంలో అభ్యర్ధులు తమ నామినేషన్లతో రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి భారీ ర్యాలీగా తరలి వస్తున్నారు. నామినేషన్ల పర్వం కొనసాగుతున్న నేపద్యంలో పోలీస్ అధికారులు కూడా బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ దశలో టిడిపి అభ్యర్ధితో నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన టిడిపి ఎమ్మెల్యే వెలగపూడి రామక్రిష్ణబాబును వెళ్లేందుకు అనుమతించకుండా పోలీసులు అడ్డుకోవడంతో ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో మూడు సార్లు నామినేషన్లు వెసిన తన కెప్పుడే ఇలాంటి సందర్బాలు రాలేదని అన్నారు. జగన్ ప్రభుత్వ హాయంలో పాలన మోత్తం ఏకపక్షంగా కొనసాగుతోందని ఆరోపించారు. మరోవైపు టిడిపి , వైసీపీ అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేశారు.