పుర ఎన్నికల బహిష్కరణ
కర్నూలు, మార్చి 13
డోన్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలను బాయ్ కాట్ చేస్తున్నామని మాజీ ఉపముఖ్యమంత్రి కెయి. కృష్ణమూర్తి అన్నారు. వైసీపీ,పోలీసుల అరాచకాలకు దూరంగా ఉండాలనే ఉద్ద్యేశంతో పోటీ చేయడం లేదు. వైసీపీకి డోన్ మున్సిపల్ కార్పోరేషన్ పదవులను దానంగా ఇచ్చేస్తున్నామని అన్నారు. తెలుగుదేశంపార్టీ నాయకులపై దాడులు అక్రమ కేసులు బనాయిస్తూ భయబ్రాంతులకు గురిచేస్తుండడం బాధాకరమని అన్నారు. తమ సోదరుడు కెయి.ప్రభాకర్ మాకు అందుబాటులో లేడు ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. వైసీపీలో వెళ్లాలనుకుంటే మాకు ఎలాంటి అబ్యంతరం లేదు సంతోషంగా వెళ్లొచ్చని అన్నారు.