.ముందు వాళ్ల ఇంట్లోవాళ్లకు టెస్టులు చేయించాలి
తెలుగు మహిళ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే, అనిత
విశాఖపట్నం, మార్చి 13
వైసీపీ సర్కార్పై తెలుగు మహిళా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే అనిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇది వైసీపీ ఆవిర్భావ దినోత్సవం కాదని.. అరాచక దినోత్సవమని బవ్యంగ్యాస్త్రం సంధించారు. మహిళలకు బ్రీత్ ఎనలైజర్ టెస్టు చేయాలని విశాఖలో ఒక వైసీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను అనిత ఖండించారు. ఈ డిమాండ్ ఎవరు చేశారో వాళ్ళ ఇంట్లోని మహిళలకు బ్రీత్ ఎనలైజర్ టెస్టులు చేయించాలని ఎద్దేవా చేశారు. వైసీపీ చేసే తప్పుడు పనులకు ‘సాక్షి’ కరపత్రంగా మారిందని విమర్శించారు. ‘రాయలసీమ ముద్దుబిడ్డ జగనన్న’ అంటూ ఒక మంత్రి టిక్టాక్లు చేసుకొనే కేబినెట్ ఇక్కడ ఉందన్నారు. ప్రతిపక్షాలు నామినేషన్లు వేయకుండా వైసీపీ ప్రయత్నం చేస్తోందని, ఇదేమి న్యాయమని ఆమె ప్రశ్నించారు. టీడీపీ అంటే వైసీపీకి భయమని, అందుకే నామినేషన్లు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. జగన్ 9 నెలల పాలనలో కనీసం 9 సామాజిక వర్గాలైనా సంతోషంగా ఉన్నాయా అని నిలదీశారు. ఓడిపోతామని తెలిసినా వర్ల రామయ్య హ్యాపీగా రాజ్యసభకు పోటీ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. టీటీడీ బోర్డులో ఒక దళితుడు కూడా లేడని, దళితులకు వైసీపీ అన్యాయం చేసిందని, దీనికి అధికార పార్టీయే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సాహిస్తున్నారని, వారి పరిపాలన అంతా ప్రజలు గమనిస్తున్నారన్నారు. మహిళలకు బ్రీత్ ఎనలైజర్ టెస్టు చేయాలని విశాఖలో ఒక వైసీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఈ డిమాండ్ ఎవరు చేశారో వాళ్ళ ఇంట్లోని మహిళలకు బ్రీత్ ఎనలైజర్ టెస్టులు చేయించాలని ఎద్దేవా చేశారు.